అన్వేషించండి

TDP News: సీటు పరేషాన్‌, మొన్నటి వరకు వైసీపీ- ఇప్పుడు టీడీపీలో జంపింగ్‌లు

TDP Leaders Ready To Jump: జంపింగ్‌లు వ్యవహారం వైసీపీని టెన్షన్‌ పెడుతూ వచ్చింది. ఇప్పుడు సీట్ల ప్రకటనకు సిద్ధం అవుతున్న టీడీపీని కూడా జంపింగ్‌ జపాంగ్‌లు ఆందోళనకు గురి చేస్తున్నారు. 

TDP Leaders Joins To YSRCP: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరన్న మాట ఎంత నిజమో. అదే రాజకీయ నాయకులకు శాశ్వత పార్టీలు ఉండవు అన్నద కూడా అంతే నిజంగా ప్రస్తుతం కనిపిస్తోంది. ఒకప్పుడు నేతలు విలువలు, సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేసేవారు. ఏ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేశారో.. తుది వరకు అదే పార్టీలో ఉండేవారు. ఇప్పటికీ అటువంటి నేతలు కొందరు ఉన్నారు. అత్యధిక నేతలు మాత్రం అవకాశాలు, అవసరాలు ప్రామాణికంగానే రాజకీయాలు చేస్తున్నారు. ఏ పార్టీ అవకాశం ఇస్తే అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అప్పటి వరకు ఉన్న పార్టీలో టికెట్లు రాలేదోనో, నచ్చిన స్థానాన్ని కేటాయించలేదో అన్న కారణంతో చాలా మంది నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీలో ఈ వ్యవహారం ఎక్కువగా కనిపిస్తోంది. టికెట్లు రాకపోవడంతో చాలా మంది నేతలు పార్టీ వీడుతూ వచ్చారు. ఈ జాబితాలో వైసీపీకి చెందిన సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారం వైసీపీని టెన్షన్‌ పెడుతూ వచ్చింది. ఇప్పుడు సీట్ల ప్రకటనకు సిద్ధం అవుతున్న టీడీపీని కూడా జంపింగ్‌ జపాంగ్‌లు ఆందోళనకు గురి చేస్తున్నారు. 

వైసీపీలోకి వెళ్లే నేతలెవరో

టీడీపీలో ఏళ్ల నుంచి ఉన్న ఎంతో మంది నేతలు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా పలువురు నేతలు చేరగా, మరింత మంది సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన టీడీపీ, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ను కలిశారు. ఈ పరిణామం టీడీపీకి షాక్‌ అనే చెప్పాలి. టీడీపీ నూజివీడు ఇన్‌చార్జ్‌గా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి ఖరారు చేశారన్న ప్రచారం ఉంది. నూజివీడులో ఆయన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వెంకటేశ్వరరావు కొద్దిరోజులు కిందట నిర్వహించిన సమావేశంలో బోరున విలపించారు. చంద్రబాబు టికెట్‌ కేటాయిస్తారన్న ఆశ లేకపోవడంతో ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేతను ఆయన కలిసినట్టు చెబుతున్నారు. ఈయనతోపాటు అనేక జిల్లాల్లో టికెట్లు రాని నేతలంతా ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. తాజాగా రాయచోటిలో రమేష్‌ రెడ్డి తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయనకు టికెట్‌ ఇవ్వరన్న ప్రచారం నేపథ్యంలో అనుచరులతో భారీ ఎత్తున సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. చంద్రబాబు ఫొటో, టీడీపీ జెండాలు లేకుండానే సమావేశాన్ని నిర్వహించారు. ఈయన ఎటువైపు అడుగులు వేస్తారన్న ఆసక్తి నెలకొంది. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు తేలితే సీట్లపై స్పష్టత వస్తుంది. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వస్తే.. ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంది. వారంతా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం రాజకీయంగా పెనుమార్పులకు కారణం కావచ్చని చెబుతున్నారు. 

కూటమికి తప్పని ఇబ్బందులు

ప్రస్తుతం సీట్ల పంపకాలతో వైసీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పోలిస్తే కూటమి పార్టీకి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశముంది. ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గరు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి సీటు ఇచ్చినా.. మిగిలిన నేతలు అలకబూనే చాన్స్‌ ఉంది. అటువంటి వారంతా పార్టీ మారేందుకు వెనుకాడరు. ఈ ఇబ్బందులు, అలకలను సంతృప్తిపరచడం ఆయా పార్టీల నేతలకు తలకుమించి సమస్యగా మారనుంది. ఇదే ఇప్పుడు ఆయా పార్టీల నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. పొత్తు తేలి సీట్ల పంపకాలు పూర్తయిన తరువాత కూటమి పార్టీలోని నేతలకు అసలు తలనొప్పి ప్రారంభమయ్యే అవకాశముందని చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Embed widget