అన్వేషించండి

Sharmila On Jagan : జగన్ మానసిక పరిస్థితిపై ఆందోళన - అద్దం పంపిన షర్మిల - ఎందుకంటే ?

Andhra News : జగన్ మానసిక పరిస్థితిపై భయంగా ఉందని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అద్దంలో చూసుకుంటే ఎవరు కనిపిస్తారో చెప్పాలని ఓ అద్దం పంపారు.

Elections 2024 :  వైసీపీ అధినేత , సీఎం జగన్ మానసిక స్థితిపై షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. అద్దం పంపిస్తున్నానని అందులో చూసుకోవాలని సలహా ఇచ్చారు. అద్దంలో మీకు మీ మొహం కనిపిస్తుందా ? చంద్రబాబు కనిపిస్తుందా ? చెప్పాలన్నారు.  తాను చంద్రబాబు తో చేతులు కలిపినట్లు ..కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయా ..  ఒక్క సాక్ష్యం అయినా...ఒక్క ఆధారం అయినా చూపించ గలరా అని సవాల్ చేశారు.  జగన్ ఒక భ్రమలో ఉన్నాడు... జగన్ ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉంది..  జగన్ వైఖరి మాలోకం ను తలపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నా జన్మకు చంద్రబాబును ఒక్క సారే కలిశాను ! 

నా జన్మ కి నేను చంద్రబాబు ను ఒక్కసారి మాత్రమే కలిశానని.. నా కొడుకు పెళ్లి కి పిలవడానికి మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు.  ఆనాడు YSR కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడని గుర్తు చేసుకున్నారు.  ఆ స్ఫూర్తి తోనే నేను చంద్రబాబు ను పిలవడానికి వెళ్లానని.. నేను 5 నిమిషాలు కూడా ఏనాడూ చంద్రబాబుతో మాట్లాడలేదన్నారు.  చంద్రబాబు చెప్తే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా  అని జగన్ ను నిలదీశారు.  బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ ఆయన చెబితే చేశానా అని మండిపడ్డారు. 

అందరూ చంద్రబాబు చెప్పినట్లే వింటారా ? 

సునీత, రేవంత్ రెడ్డి  కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట అని షర్మిల ఎద్దేవా చేశారు.  బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మ్యానేజ్ చేశాడట .. చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయ్యారో...ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలని జగన్ కు సూచించారు. జగన్ మానసిక పరిస్థితి పై నాకు ఆందోళన గా ఉందన్నారు.   

వివేకా హత్యలో న్యాయం కోసం పోరాటం ! 

తండ్రి పేరుని సీబీఐ ఛార్జిషీటులో చేర్చాలంటూ మూడు కోర్టులు తిరిగిన వ్యక్తికి ఏఏజీ పదవిని అప్పజెపుతారా అని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆయన సోదరి, ఏపీసీసీ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన ప్రశ్నకు జగన్  సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పదవిని ఇచ్చారని. ఈ నిర్ణయం జగన్ మేరకు జరగకపోతే పొన్నవోలుకు ఈ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆమె అన్నారు. జగన్ ఆదేశాల మేరకే పొన్నవోలు కోర్టులకు తిరిగారని చెప్పడానికి ఈ పదవే ఒక రుజువని షర్మిల వ్యాఖ్యానించారు. తన తండ్రి పేరుని సీబీఐ ఛార్జిషీటులో చేర్చాలంటూ కోర్టులకు తిరిగిన వ్యక్తికి తానైతే అలాంటి పదవిని ఇవ్వబోనని ఆమె స్పష్టం చేశారు.  ‘‘ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జిషీటులో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్ పట్టుబట్టి చేర్చారు. అయితే ఇప్పుడు నేను మాటలు మార్చినట్టుగా పొన్నవోలు నా పాత వీడియోలను వెతికి మరీ చూపిస్తున్నారు. నన్ను ఊసరవెళ్లిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు నిజం తెలియక మేము అలా మాట్లాడాం. ఈ రోజు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నామన్నారు. 

వైఎస్ హత్యపైనా జగన్ తప్పుడు ప్రచారాలు 

YSR మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని  జగన్ కూడా ఆరోపణలు చేశారని రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేశారని గుర్తు చేశారు.  జగన్ సిఎం అయ్యాక రెలియన్స్ చెప్పిన వాళ్లకు రాజ్యసభ ఇచ్చారని..   తాను చెప్పింది అబద్ధం అని నిరూపించుకున్నారన్నారు. వివేకా హత్య తర్వాత చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణ చేశాడు .. CBI విచారణ చేయాలని డిమాండ్ చేశాడన్నారు.  సీఎం అయ్యాక CBI విచారణ వద్దు అన్నారని..   నిజంగా చంద్రబాబు హస్తం ఉంటే ఎందుకు CBI విచారణ వద్దు అన్నారని ప్రశ్నించారు.   నేను YSR బిడ్డను....నేను ఎంత మొండి దాన్నో జగన్ కి తెలుసని..   నేను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగే వ్యక్తి కాదని..   నాకు ఎవరో ఏదో చెప్తే నమ్మే వ్యక్తిని కాదని షర్మిల స్పష్టం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget