అన్వేషించండి

Revanth Reddy : రిజర్వేషన్లు రద్దు చేయడానికే జనగణన చేయలేదు - అసిఫాబాద్‌లో రేవంత్ రెడ్డి ఆరోపణ

Telangana News : రిజర్వేషన్ల రద్దుపై రేవంత్ రెడ్డి తన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. జనగణనను ఉద్దేశపూర్వకంగా ఆపేశారని అసిఫాబాద్‌లో ఆరోపించారు.

Telangana Politics :   2021 లో దేశ జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.   మోడీ అమిత్ షా లు జనగణన చేయకుండా అడ్డు కుంటున్నారని..  జనాభా లెక్కింపు జరిగితే పెరిగిన జనాభా కు అనుకూలంగా కులాలకు రిజర్వేషన్లు పెంచాలి కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేయలేదన్నారు.  400 సీట్లు వస్తే పార్లమెంటు లో పూర్తి మెజారిటీ వుంటుంది కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారుని ఆరోపించారు. అసిఫాబాద్ లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా రేవంత్ రెడ్డి  ప్రచారం నిర్వహించారు.  మీ ఓటు తో... సీటు గెలిచి మీ రిజర్వేషన్లు రద్దుచేయాలని బీజేపీ పార్టీ మోడీ చూస్తున్నారని ఆరోపించారు.  కాబట్టి ప్రజలు ఆలోచించు కోవాలన్నారు.  ఇవన్నీ నేను అడిగితే ఢిల్లీ పోలీసుల తో నరేంద్ర మోడీ నాకు నోటీసులు పంపించిండని..  ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు రేవంత్ రెడ్డి భయపడడని ప్రకటించారు.  బీజేపీ కుట్ర రాజకీయాలను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునచ్చారు. 
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని రేవంత్ రెడ్డి  అన్నారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం అభివృద్ధి కోసం నిధులు కేటాయించామన్నారు. ఆదిలాబాద్‌లో సీసీఐ మూతపడినా ఏనాడూ ప్రధాని మోడీ, కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ఆదిలాబాద్‌కు మోడీ, కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.  తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. తప్పించుకునే ప్రయత్నం తాము చేయలేదని.. బాధ్యతగా భావించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు. బలహీన వర్గాల కులగణను చేస్తున్నట్లు ప్రకటించారు. 
  
కాంగ్రెస్ పార్టీ నుంచి 8 రాష్ట్రాలను బీజేపీ బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. దేశంలో 15 రాష్ట్రాలు ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అని చెప్పారు. ఆ కుట్రలో భాగంగానే 8 రాష్ట్రాలను లాక్కుందని అన్నారు.పేద ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గా అవకాశం ఇచ్చిందని..  మొదటిసారి ఆదిలాబాద్ ఎంపీ గా పోటీ చేసే అవకాశం మహిళ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు.  మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారని..  గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యలను కేసీఆర్ ఎన్నడు పట్టించుకోలేదని..  ఆదివాసీ పట్ల గోండ్ ల పట్ల కొమురం బీం పట్ల బీజేపీ చిన్నచూపు చూసిందన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కు సమస్యల పట్ల అవగాహన ఉందని గెలిపిస్తే ఆదివాసీల కోసం నిరంతరం శ్రమిస్తారన్నారు. 

రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. అసిఫాబాద్ సభలోనే అదే ప్రచారం చేస్తారు. బీజేపీ ఏమిచ్చిదంటే.. గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రజలతో నినాదాలు చేయించారు.                                       

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget