అన్వేషించండి

Pawan Kalyan: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో పవన్‌ భేటీ, కీలకాంశాలపై చర్చలు

Union Minister Gajendra Singh Shekawat : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, బీజేపీ నేతలతో పవన్‌ కల్యాణ్‌ ఆదివారం సమావేశమయ్యారు. వీరి మధ్య అర్ధగంటపాటు భేటీ జరిగింది.

Pawan Kalyan Met With Union Minister Gajendra Singh Shekawat. Discussions Lasted For Half An Hour : రాష్ట్రంలో పోటీ చేయబోయే స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఐదు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (Gajendra Singh Shekawat) ఆదివారం విజయవాడకు వచ్చి ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనూహ్యంగా ఈ సమాశానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. చంద్రబాబుతో కలిసి సోమవారం విజయవాడకు రావాల్సిన పవన్‌ కల్యాణ్‌ బీజేపీ కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రమే గన్నవరం విమానాశ్రయాని (Gannavaram Airport)కి చేరుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ నేతలు సమావేశమైన నోవాటెల్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. వీరి మధ్య సుమారు అర్ధగంటపాటు భేటీ జరిగింది. కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. 

పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత కోసమేనా

పొత్తులో భాగంగా జనసేన 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. ఇప్పటికే కొన్ని స్థానాలకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీకి ఆరు ఎమ్మెల్యేలు, ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఆయా స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే జనసేన పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టతను తీసుకోవడం ద్వారా అభ్యర్థులను ప్రకటించే ఉద్ధేశంతో పవన్‌ను భేటీ ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కొన్ని చోట్ల బీజేపీకి సీనియర్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవసరమైతే ఒకటి, రెండు సీట్లకు సంబంధించిన సర్ధుబాట్లపైనా ఈ సమావేశంలో పవన్‌, బీజేపీ నేతలు మధ్య చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. బీజేపీ బలంగా ఉన్న స్థానాలను కోరేందుకు పవన్‌ను ఆహ్వానించారా..? లేక ఇంకేమైనా అంశాలపై చర్చ జరిగిందా..? అన్నది తెలియాల్సి ఉంది. 

సీట్లపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్న పురందేశ్వరి

పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని, పోటీ చేయబోయే సీట్లపైనా రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. పొత్తు ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. సీట్ల విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచకాలు అంతానికి అంతా కలిసి రావాలని ఆమె కోరారు. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ అభిప్రాయ సేకరణ చేపట్టనుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె వెల్లడించారు.

Also Read: ఎన్నికల ప్రచారానికి పవన్ ప్రణాళికలు- ఒకే రోజు 2, 3 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget