అన్వేషించండి

Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?

Mizoram Election Results 2023: 3 దశాబ్దాల తరవాత మిజోరం రాష్ట్రాన్ని కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిగా లల్దుహోమ పరిచయమయ్యారు.

Mizoram Election Results:

లల్దుహోమదే విజయం..

ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ (Zoram People's Movement) మెజార్టీ (Mizoram Election Results 2023) సాధించింది. బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) ఈ సారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. ఇప్పుడు జెడ్‌పీఎమ్‌ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ లల్దుహోమ (Lalduhoma) పేరు బాగా వినిపిస్తోంది. ఆయనే ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. అధికార MNFపై  (Mizo National Front) అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు వాటిని నిరూపించడంలోనూ సక్సెస్ అయ్యాలు లల్దుహోమ. అందుకే సులువుగా విజయం సాధించగలిగారు. దీంతో పాటు మద్యపాన నిషేధం అనే హామీని విస్తృతంగా ప్రచారం ( Who is Lalduhoma) చేశారు. ఇది కూడా కొంత వరకూ ZPMకి కలిసొచ్చింది. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీని స్థాపించింది ఆయనే. సెక్యులరిజమే ఎజెండాగా పార్టీని ముందుకు నడిపించారు. 74 ఏళ్ల లల్దుహోమ...IPS అధికారిగా తన కెరీర్‌ని మొదలు పెట్టారు. గోవాలో IPSగా సేవలందించారు. ఆ తరవాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. ఈ సమయంలోనే ఆయనకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. 1980ల్లో కాంగ్రెస్‌లో చేరారు. 1984లో మిజోరం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 1985లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. రెండేళ్ల తరవాత Zoram Nationalist Party (ZNM) పార్టీని స్థాపించారు. ఇది మిజోరం పాలిటిక్స్‌లో గేమ్‌ఛేంజర్ అయింది. 2017లో స్థానికంగా 6 పార్టీలను కలుపుకుని  Zoram People's Movement కూటమిని ఏర్పాటు చేశారు లల్దుహోమ. 

ప్రత్యామ్నాయంగా ఎదిగిన ZPM..

1984లో లల్దుహోమ లోక్‌సభలో ఎంట్రీ ఇచ్చారు. అనుకున్నంత సులువుగా ఆయన పొలిటికల్ జర్నీ కొనసాగలేదు. ఎంపీ అయిన కొద్ది రోజులకే సవాళ్లు ఎదురయ్యాయి. ఫిరాయింపుల చట్టం కింద అనర్హతా వేటుకి గురయ్యారు. ఇలా అనర్హతకు గురైన తొలి ఎంపీగా రికార్డుకెక్కారు. 2020లోనూ ఫిరాయింపుల చట్టం కిందే మిజోరం అసెంబ్లీ ఆయనపై అనర్హతా వేటు వేసింది. అయినా సరే పంతం వీడలేదు లల్దుహోమ. సెర్చిప్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు.  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో 6 స్థానాల్లో గెలిచింది ZPM.2019లో ఈ కూటమి అధికారికంగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. నిజానికి అప్పటి వరకూ ఉన్న మిజోరం రాజకీయాలు లల్దుహోమా ఎంట్రీతో చాలా ఆసక్తికరంగా మారాయి. అప్పటి వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థులు అంటే...కాంగ్రెస్ తరపున లాల్ తన్హ్‌వాలా (Lal Thanhwala), MNF నుంచి జోరంతంగ (Zoramathanga) పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ...ఇప్పుడు లల్దుహోమా కూడా ఈ రేస్‌లోకి వచ్చారు. ఆ స్థాయిలో అక్కడి రాజకీయాల్ని ప్రభావం చేయగలిగారు. దాదాపు మూడు దశాబ్దాల తరవాత మిజోరంకి కొత్త ముఖ్యమంత్రిగా లల్దుహోమ పరిచయం అవబోతున్నారు. దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇన్నాళ్లూ మరో ఆప్షన్‌ లేదనుకున్న ఓటర్లకు..బెస్ట్ ఆప్షన్‌గా తమ పార్టీని రేసులో నిలబెట్టారు. అందుకే...ఈ సారి మెజార్టీ మార్క్ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోయింది జెడ్‌పీఎమ్. 

Also Read: Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget