అన్వేషించండి

Visakha South: విశాఖ దక్షిణంలో నాలుగో ఎన్నిక - ఆసక్తి రేపుతోన్న పోరు

The fourth election in Visakhapatnam south an interesting fight: విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం విశాఖ దక్షిణం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైంది. ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.

Present political Scenario in Visakha South Seat: విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం విశాఖ దక్షిణం. నగర పరిధిలోని ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మత్స్యకార ఓటర్లు ఉంటారు. 2009 నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పాటైంది. ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగో ఎన్నికకు ఈ నియోజకవర్గం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2,76,723 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,35,695 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,41,011 మంది ఉన్నారు. 

మూడు ఎన్నికల ఫలితాలు ఇవే

ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని దక్కించుకుంది. నియోజకవర్గం ఏర్పాటైన 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ విజయాన్ని దక్కించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి కోలా గురువులపై 341 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 2014లో జరిగిన రెండో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోలా గురువులుపై 18,316 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన మూడో ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి వాసుపల్లి గణేష్‌ కుమార్‌ విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌పై 3729 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 

ఆసక్తి కలిగిస్తున్న రాజకీయం

2024 ఎన్నికలకు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటమిలో భాగంగా ఇక్కడి సీటును తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశముంది. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైసీపీకి అనుబంధంగా కొనసాగుతూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అధిష్టానం కూడా ఆయనకే టికెట్‌ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా గండి బాబ్జీ బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా పని చేసిన ఈయన్ను కొన్నాళ్ల కిందట టీడీపీ ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పెట్టింది. ఆయన ప్రజల్లోకి జోరుగా వెళుతున్నారు. వాసుపల్లి గణేష్‌కుమార్‌, గండి బాబ్జీ ఇద్దరూ జోరుగా ప్రజల్లో తిరుగుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండబోతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget