అన్వేషించండి

Munugodu By Elections: మునుగోడులో టీఆర్‌ఎస్‌ సమరశంఖం- పోటీ చేసేదెవరో తేల్చేసిన కేసీఆర్!

టీఆర్‌ఎస్‌ ముందడుగు వేసింది. అన్ని పార్టీలు ఇంకా చర్చల దశలో ఉండగానే మునుగోడు ఉప ఎన్నికలో దింపేందుకు తమ అభ్యర్థి ఎవరో చెప్పేసింది.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ సమర శంఖం పూరించింది. ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే దీనిపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని 20న సంస్థాన్‌ నారాయణపూర్‌లో జరిగే ప్రజాదీవెన సభలో ప్రకటించబోతున్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నికలు రాబోతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు ఎవరూ దీన్ని ప్రకటించలేదు. మరోవైపు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. అక్కడ పోటీ చేసేందుకు ఇద్దరు బరిలో ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. వాళ్లిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ లీడర్లంతా మూడు రోజులుగా దీనిపై కసరత్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న పరిస్థితిలో వచ్చిన మునుగోడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ జెండా ఎగరేసి వచ్చే ఎన్నికల నాటికి లైన్ క్లియర్ చేసుకోవాలన్న కసితో పని చేస్తున్నాయి. గత ట్రాక్ రికార్డు చూస్తే కాంగ్రెస్ ఎక్కువ సార్లు అక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత సీపీఐకు ప్రజలు ఎక్కువ సార్లు పట్టంకట్టారు. టీఆర్‌ఎస్‌ ఒక్కసారి మాత్రమే అక్కడ గెలిచింది. 

అభ్యర్థులపై ఆయా పార్టీల్లో చర్చలు జరుగుతుండగానే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రం ఓ అడుగు ముందుకేసింది. పోటీ చేయబోయేది ఎవరో అనేది కేడర్‌కు స్పష్టంగా చెప్పేసినట్టు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ సీటు అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎలాగైన గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేదని నిరూపించుకోవాలని స్కేచ్ వేస్తోంది. అందుకే దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget