అన్వేషించండి

Election Commission letter to AP Govt : ఇవాళే ఎందుకు డబ్బులు జమ చేయాలి - ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఈసీ లేఖ

Andhra News : ఓటర్ల ఖాతాల్లో నగదు జమ చేసే అంశంపై ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది. బట న్లు నొక్కినప్పుడు లేని నిధులు ఇప్పుడు ఎలా వచ్చాయో చెప్పాలని సూచించింది.

Elections 2024 : ఏపీ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మరో లేఖ రాసింది.  జనవరిలో ప్రారంభించిన పథకాలకే ఇప్పటి వరకు నగదు ఇవ్వని మీకు.. ఇప్పుడు ఒకే సారి ఇంత నగదు ఎలా వచ్చిందని  ఈసీ ప్రశ్నించింది. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ..  మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.  

ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే నగదు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలపై కొందరు లబ్దిదారులు హైకోర్టుులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్.. ఒక్క రోజు నగదు జమ చేసకోవడానికి అనుమతి ఇచ్చారు. శని, ఆది, సోమవారాలు  బ్యాంకులకు సెలవు. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఎలాంటి జమలు ఉండకూడదు. అందుకే శుక్రవారమే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలనుకున్నారు.  ప్రభుత్వం వద్ద ఎన్ని నిధులు ఉన్నాయో స్పష్టత లేదు. రాత్రి తొమ్మిది గంటలకు హైకోర్టు నుంచి అనుమతి లభిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఉదయం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయలేకపోయారు.                                 

ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలంటే ముందు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఉండాలి. ఎక్కువ పథకాలకు ఇచ్చిన నిధులు గత ఆర్థిక సంవత్సానికి చెందినవి. అప్పుడు ఇచ్చిన  బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇప్పుడు చెల్లవు. మరో సారి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డంగా ఉంది. అనుమతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆలస్యమవుతోంది. ఈ లోపు కొంత మంది న్యాయవాదులు హైకోర్టు డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించారు.                             

అదే సమయంలో ఈసీ హైకోర్టు ఈ ఒక్క రోజు జమ కు అవకాశం కల్పించినప్పటికీ.. అధికారంగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. పైగా.. మూడు గంటలలోపు తాము వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఓటర్లను  ప్రలోభ పెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా నిధులను ఆపి.. ఇప్పుడు ఓటింగ్ కు ముందు జమ చేస్తున్నారని ఈసీ అనుమతిస్తోంది. బటన్లు నొక్కినప్పుడు ఎందుకు జమ చేయలేదు.. అప్పుడు లేని నిధులు ఇప్పుడు ఎలా వచ్చాయో చెప్పాలని కోరింది. అదే సమయంలో గతంలో బటన్లు నొక్కిన ఎన్ని రోజులకు డబ్బులు జమ చేసేవారో కూడా చెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలు, హైకోర్టు విచారణ ఇవన్నీ పూర్తయ్యే లోపు బ్యాంకు సమయం ముగిసిపోతుందని వైసీపీ వర్గాలు అందోళన చెందుతున్నాయి. పథకాల నిధులన్నీ పెండింగ్ లో ఉండటం.. ఇలా వివాదం అవుతుందని తెలిసి కూడా ముందుగానే జమ చేయకపోవడం సమస్యగా మారుతోంది.                  

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget