అన్వేషించండి

కాంగ్రెస్ మొదటి జాబితాలో సీనియర్లకు తప్పని నిరాశ- ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారంటే?

ఎలాంటి వివాదాలకు తావు లేనివి, ఉన్నా సర్ధి చెప్పుకోదగ్గ నియోజకవర్గాలను మాత్రమే కాంగ్రెస్ తన మొదటి జాబితాలో పెట్టింది. ఇందులో చాలా మంది సీనియర్లకు నిరాశ పరిచింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. 55 మందితో ప్రకటించిన ఈ జాబితాలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే తమకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి కాకుండా వేరే వాళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ సీనియర్ల పేర్లు కూడా జాబితాలో ఉండకపోవడం ఆసక్తిని రేపుతోంది. 

ఎలాంటి వివాదాలకు తావు లేనివి, ఉన్నా సర్ధి చెప్పుకోదగ్గ నియోజకవర్గాలను మాత్రమే కాంగ్రెస్ తన మొదటి జాబితాలో పెట్టింది. ఇందులో చాలా మంది సీనియర్లకు నిరాశ పరిచింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే 55 మందిలో 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలు ఇద్దరికి చోటు కల్పించారు. 12 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఓసీలు 26 మంది. ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి ఏడుగురురికి, రెడ్డి సమాజాకి వర్గానికి 17 మందికి, బ్రాహ్మణ కులానికి చెందిన ఇద్దరు అభ్యర్థులకు సీటు ఇచ్చారు. వీరిలో వివిధ పార్టీల నుంచి వచ్చిన 12 మంది కూడా ఉన్నారు. ముస్లింలు ముగ్గురు ఉన్నారు. 

సనత్‌నగర్ నుంచి టికెట్ ఆశించిన మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యకు నిరాశ తప్పలేదు. ఆయనను కాదని అక్కడ కోట నిలిమ అనే మహిళను అభ్యర్థిగా ప్రకటించారు. జర్నలిస్టుగా పని చేసిన ఈమె సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వంపై, ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అందుకే ఆదిత్యకు బదులు ఈమెను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు.  
Image

మరో కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకు సుధాకర్‌కి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకు మొదటి జాబితాలో చోటు దక్కలేదు. మొదట బీఆర్‌ఎస్‌లో ఉన్నా ఆయన కేసీఆర్‌తో విభేదించి తెలంగాణ ఇంటిపార్టీ పేరుతో అనే ప్రత్యేక పార్టీ పెట్టి పోరాటం చేశారు. 2022 ఆగస్టులో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. నకిరేకల్‌ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆయనకు బదులు ఈ మధ్యే బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వీరేశానికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

మరో సీనియర్ లీడర్ నాగం జనార్ధన్ రెడ్డికి కూడా నిరాశ తప్పలేదు. ఆయన స్థానంలో రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మేడ్చల్ సీటు తన వర్గానికి ఇప్పేంచేందుకు ప్రయత్నించిన మైనంపల్లికి కాంగ్రెస్ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. మరోవైపు మొదటి లిస్టులో తమపేర్లు ఉంటాయని చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు భావించారు. అలాంటి వారిలో పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. వారి పేర్లు ఈ జాబితాలో లేవు. పొన్నం ప్రభాకర్ కరీనంగర్, మధుయాష్కీ ఎల్బీనగర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆ రెండు టికెట్లను పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్. ఆ లిస్ట్‌లో బలరాం నాయక్‌, సురేష్ షెట్కార్ కూడా ఉన్నారు. 

మరోవైపు కాంగ్రెస్‌ పెట్టుకున్న ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ రూల్‌ను తెలంగాణలో పాటించలేదు. మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇచ్చారు. మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి బరిలో ఉంటే మెదక్‌ నుంచి ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు పోటీ చేస్తున్నారు. హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పోటీలో ఉంటే... కోదాడ టికెట్‌పై పద్మావతి రెడ్డి అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget