అన్వేషించండి

Chandra Babu: ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఘర్షణలపై ప్రభుత్వం ఫోకస్‌- సీనియర్ అధికారి ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటుకు సన్నాహాలు!

Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న గొడవులపై నిజాలు నిగ్గుతేల్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కీలక నిర్మయం తీసుకోవాలని ఆలోచిస్తోంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికలు నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్ ఆఫ్టర్. నోటిఫికేషన్ రాక ముందు నుంచే పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజున మొదలైన కొట్లాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికార మార్పిడీ జరగడంతో కొన్ని చోట్ల ఉత్సాహంతో మరికొన్ని చోట్ల పగతో ఇంకొన్ని ప్రాంతాల్లో గెలవలేదన్న ఆగ్రహంతో గొడవలు జరుగుతున్నాయి. 

ఘర్షణ ఎలాంటిదైనా నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ అన్ని వేళ్లు మాత్రం ప్రభుత్వంవైపే చూపిస్తున్నాయి. అందుకే ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ వేయాలని ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. 

ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్ అధికారి ఆధ్వర్యంలో ముఖ్యమైన అధికారులతో కలిసి అసలేం జరిగింది, గొడవలకు కారణమేంటీ, నిజంగా పార్టీ కక్షలోతనే ఘర్షణలు జరిగాయా లేకుండా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట్ దర్యాప్తు సాగనుందనట. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని సమాచారం. ప్రస్తుతానికి ఆర్థిక వనరుల సమీకరణ, బడ్జెట్‌ కూర్పుపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్డ్‌గా ఉన్నారు. వీటిపై క్లారిటీ వచ్చిన తర్వాత సిట్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. 

వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఒకట్రెండు ఘర్షణలను పార్టీలకు ఆపాదించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనిస్తోంది. అదే టైంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో ప్రజల్లో అనుమానాలు రాకుండా ఉండేలా సిట్ ఏర్పాటుతో వైసీపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఎన్నికల టైంలో జరిగిన ఘర్షణలపై ఎన్నికల సంఘం ఒక సిట్ వేసింది. ప్రాథమికంగా ఓ నివేదిక ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సిట్ ఏమైందో ఎవరూ చెప్పడం లేదు. 

నేతలతో సమావేశమైన ప్రతిసారీ ప్రతికార రాజకీయాలు వద్దని చంద్రబాబు నేతలతో చెబుతున్నారట. అలాంటి రాజకీయమే వైసీపీని దెబ్బ తీసిందని ఎట్టి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు వద్దని ప్రజలతో మమేకమయ్యే చర్యలు మాత్రమే చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ మధ్య జరిగిన రెండు పరిణామాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. తిరువూరు ఎమ్మెల్యే దూకుడుగా వైసీపీ నేత ఇంటిపైకి వెళ్లడంతో చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట. పోలీసులతో మంత్రి రామ్‌ప్రసాద్ భార్య వ్యవహరించిన తీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి రిపీట్ చేస్తే బాగోదని క్లాస్‌తీసుకున్నారు. 

ఇంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ స్థానికంగా ఉండే విభేదాలతో జరిగిన ఘర్షణలను పార్టీకి ఆపాదించడంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. దీని లెక్క తేల్చేందుకే సిట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
CM Revanth Reddy: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
IND Vs BAN Innings Highlights: బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
CM Revanth Reddy: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
IND Vs BAN Innings Highlights: బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Hyderabad News: భార్యతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో స్పోర్ట్స్ బైక్ లుక్ వీటికే సొంతం - ఏ బైక్స్ ఉన్నాయో తెలుసా?
రూ.1.5 లక్షల్లో స్పోర్ట్స్ బైక్ లుక్ వీటికే సొంతం - ఏ బైక్స్ ఉన్నాయో తెలుసా?
Embed widget