అన్వేషించండి

Chandra Babu: ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఘర్షణలపై ప్రభుత్వం ఫోకస్‌- సీనియర్ అధికారి ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటుకు సన్నాహాలు!

Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న గొడవులపై నిజాలు నిగ్గుతేల్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కీలక నిర్మయం తీసుకోవాలని ఆలోచిస్తోంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికలు నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్ ఆఫ్టర్. నోటిఫికేషన్ రాక ముందు నుంచే పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజున మొదలైన కొట్లాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికార మార్పిడీ జరగడంతో కొన్ని చోట్ల ఉత్సాహంతో మరికొన్ని చోట్ల పగతో ఇంకొన్ని ప్రాంతాల్లో గెలవలేదన్న ఆగ్రహంతో గొడవలు జరుగుతున్నాయి. 

ఘర్షణ ఎలాంటిదైనా నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ అన్ని వేళ్లు మాత్రం ప్రభుత్వంవైపే చూపిస్తున్నాయి. అందుకే ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ వేయాలని ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. 

ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్ అధికారి ఆధ్వర్యంలో ముఖ్యమైన అధికారులతో కలిసి అసలేం జరిగింది, గొడవలకు కారణమేంటీ, నిజంగా పార్టీ కక్షలోతనే ఘర్షణలు జరిగాయా లేకుండా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట్ దర్యాప్తు సాగనుందనట. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని సమాచారం. ప్రస్తుతానికి ఆర్థిక వనరుల సమీకరణ, బడ్జెట్‌ కూర్పుపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్డ్‌గా ఉన్నారు. వీటిపై క్లారిటీ వచ్చిన తర్వాత సిట్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. 

వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఒకట్రెండు ఘర్షణలను పార్టీలకు ఆపాదించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనిస్తోంది. అదే టైంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో ప్రజల్లో అనుమానాలు రాకుండా ఉండేలా సిట్ ఏర్పాటుతో వైసీపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఎన్నికల టైంలో జరిగిన ఘర్షణలపై ఎన్నికల సంఘం ఒక సిట్ వేసింది. ప్రాథమికంగా ఓ నివేదిక ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సిట్ ఏమైందో ఎవరూ చెప్పడం లేదు. 

నేతలతో సమావేశమైన ప్రతిసారీ ప్రతికార రాజకీయాలు వద్దని చంద్రబాబు నేతలతో చెబుతున్నారట. అలాంటి రాజకీయమే వైసీపీని దెబ్బ తీసిందని ఎట్టి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు వద్దని ప్రజలతో మమేకమయ్యే చర్యలు మాత్రమే చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ మధ్య జరిగిన రెండు పరిణామాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. తిరువూరు ఎమ్మెల్యే దూకుడుగా వైసీపీ నేత ఇంటిపైకి వెళ్లడంతో చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట. పోలీసులతో మంత్రి రామ్‌ప్రసాద్ భార్య వ్యవహరించిన తీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి రిపీట్ చేస్తే బాగోదని క్లాస్‌తీసుకున్నారు. 

ఇంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ స్థానికంగా ఉండే విభేదాలతో జరిగిన ఘర్షణలను పార్టీకి ఆపాదించడంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. దీని లెక్క తేల్చేందుకే సిట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget