News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Election Results 2022 LIVE: యూపీ, దేశ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారు : సీఎం యోగి

Assembly Election Results 2022 LIVE Updates: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి.

FOLLOW US: 
UttarPradesh: యూపీ, దేశ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారు : సీఎం యోగి 

యూపీలో మొదటిసారిగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్​ ప్రజలు బీజేపీకి అద్భుత విజయం కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ.. యూపీతో పాటు ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే మేలు అని యోగి అన్నారు. యూపీ, దేశ ప్రజలు డబుల్ ఇంజిన్ పాలనను కోరుకుంటున్నారన్నారు. 

గోవాలో 20 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ

గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో అధికారం బీజేపీనే వరించింది. తుది ఫలితాల్లో బీజేపీ 20 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది.  తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు చెరో రెండుచోట్ల గెలుపొందాయి. మరో నాలుగు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 21 స్థానాలు కావాల్సి ఉంది. 20 సీట్లలో గెలుపొందిన బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 

UttarPradesh: యూపీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ, మరో 65 స్థానాల్లో ఆధిక్యం   

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్(202)ను బీజేపీ దాటేసింది. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 208 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ 78 స్థానాల్లో గెలుపొందింది. మరో 46 స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో ఉంది. 

Uttarakhand: ఉత్తరాఖండ్ లో మళ్లీ అధికారం బీజేపీదే, ఓటమిపాలైన సీఎం  

ఉత్తరాఖండ్​ లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ మేజిక్​ ఫిగర్​(36) కన్నా ఎక్కువ చోట్ల గెలుపొందింది. ప్రస్తుతానికి బీజేపీ 36 చోట్ల గెలవగా, మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. కానీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. 

Uttarakhand Results: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి 

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర చేతిలో 6 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 

Rahul Gandhi : ఐదు రాష్ట్రాల ఫలితాలపై రాహుల్ గాంధీ ట్వీట్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఓటమి నుంచి నేర్చుకుంటామని రాహుల్ అన్నారు. దేశం ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తామన్నారు.  

Punjab Congress: పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ 

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓడిపోయారు. 

Punjab AAP: పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం 

పంజాబ్ లో ఆమ్​ ఆద్మీ పార్టీ చరిత్ర తిరగరాసింది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆప్ ఇప్పటికే మేజిక్​ ఫిగర్ ​(59)కు అవసరమైన స్థానాలు సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 66 చోట్ల గెలిచింది. మరో 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

BJP in Assembly Elections: నాలుగు రాష్ట్రాల్లోనూ సత్తా చాటిన బీజేపీ, ఈ రెండిట్లో రికార్డు నెలకొల్పిన కమలం

BJP మొత్తం నాలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకుంది. పంజాబ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయినా కూడా గతంలో కంటే కాస్త మెరుగైన ఓట్లను సాధించింది.

ఉత్తర్ ప్రదేశ్‌లో
గత 37 ఏళ్ల యూపీ చరిత్రలోనే వరుసగా రెండోసారి ఒకే ప్రభుత్వం ఎన్నిక కావడం ఇదే తొలిసారి. అంతేకాక, ఐదేళ్లు సంపూర్ణంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న ఒక సీఎం మళ్లీ ముఖ్యమంత్రి కానుండడం కూడా యూపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఓట్ షేర్ కూడా పెరుగుతూ వస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 39.7 శాతంగా ఉన్న ఓట్ షేర్, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 42.8 శాతానికి పెరిగింది.

ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి అదే ప్రభుత్వం తిరిగి ఎన్నిక అవుతున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఉత్తరాఖండ్ చరిత్రలోనే తొలిసారిగా పాత ప్రభుత్వం సంపూర్ణ పదవీ కాలం పూర్తి చేసుకొని తిరిగి ఎన్నిక అవుతోంది. ఇక్కడ కూడా గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ షేర్ పెంచుకుంది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ లలూకా నియోజకవర్గం నుంచి ఓడించి బీజేపీ గెలుపొందింది.

గోవా
గత పదేళ్ల కాలంలో బీజేపీ పట్టు గోవాలో పెరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. 2017లో రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించగా, తాజాగా ఫలితాలతో రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ అయింది. ప్రస్తుత ఫలితాల ప్రకారం స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చయనుంది. గతంలో 32.5 శాతం ఓట్ షేర్ నుంచి ఇప్పుడు 33.6 శాతానికి పెరిగింది.

మణిపూర్
మణిపూర్ తాజా ఫలితాలతో ఆ రాష్ట్రంలో బీజేపీ బాగా మెరుగుపడింది. 2017లో రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా ఉండగా, తాజాగా మెజారిటీ ఫిగర్‌ను దాటి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ ఓట్ షేర్ మణిపూర్ గత ఎన్నికల్లో 36.3 శాతం ఉండగా.. ఇప్పుడు 37.6 శాతంగా ఉంది.

పంజాబ్‌లో
గతంతో పోలిస్తే పంజాబ్‌లో బీజేపీ కాస్త మెరుగయింది. 2017 ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితం కాగా, తాజాగా 5 సీట్లు గెలుచుకుంది. 

Punjab Elections 2022: ధురి నుంచి ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఘన విజయం

Aam Aadmi Party in Punjab: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధురీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. భగవంత్ మాన్ దాదాపు 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. భగవంత్ మాన్‌కు మొత్తం 78 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన దల్వీర్ సింగ్ గోల్డీ రెండో స్థానంలో నిలిచారు. తన గెలుపుపై భగవంత్ మాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీనియర్ బాదల్, అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు పెద్ద నేతలు ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన పంజాబ్ ప్రజలకు భగవంత్ ధన్యవాదాలు తెలిపారు.

పంజాబ్‌ ఫలితాల సరళిపై స్పందించిన కేజ్రీవాల్

పంజాబ్‌లో ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పంజాబ్‌లో ఈ మార్పు రావడానికి కారణమైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పంజాబ్ తాజా ట్రెండ్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తోంది. ఆప్ ప్రభుత్వమే ఏర్పాటు కానుంది. పంజాబ్‌లో కాబోయే సీఎం భగవంత్ మాన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు.

Punjab in Elections Live 2022: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ పరాజయం

పంజాబ్ ఎన్నికల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆప్ సత్తా చాటుతున్నా.. పంజాబ్‌లో దిగ్గజ రాజకీయ నాయకులు ఆప్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలవుతున్నారు. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌ అని కొత్త పార్టీ పెట్టిన ఆయన పాటియాలా నుంచి పోటీ చేశారు. అక్కడ ఆప్‌ అభ్యర్థిగా అజిత్‌ పాల్‌ సింగ్‌ కోహ్లీ చేతిలో అమరీందర్ పరాజయం పొందారు. ఏకంగా 13 వేల ఓట్ల తేడాతో కెప్టెన్ అమరీందర్‌పై అజిత్‌ పాల్‌ గెలుపొందారు.

Goa Assembly Elections: మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఓటమి

గోవా రాజధాని పనాజీ స్థానం నుంచి ఉత్పల్ పారికర్ పోటీ చేయగా.. ఆయన ఓడిపోయారు. దివంగత నేత అయిన మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్. ఈ సీటును బీజేపీ గెల్చుకుంది. మనోహర్ పారికర్ బీజేపీ నేత అయినప్పటికీ.. ఉత్పల్‌ బీజేపీ నుంచి టికెట్‌ ఆశించగా అధిష్ఠానం ఆయనకు ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాల్సి వచ్చింది. పనాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బాబుష్‌గా పిలిచే అటానసియో మోన్సెరటే గెలుపొందారు.

గోవాలో లేటెస్ట్ ట్రెండ్స్ ఇవీ

* BJP - 18
* INC+  - 12
* OTH - 6
* TMC - 4

Goa Elections Results: గోవాలో తాజా ట్రెండ్స్ ఇలా, స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ

Goa Elections Live: గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా కాంగ్రెస్ 13, బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. త్రుణమూల్ కాంగ్రెస్ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

BJP 17
INC+ 13
TMC 5
OTH 4
Five States Election Result 2022 Trends: ఉదయం 11 గంటలకు ఫలితాల ట్రెండ్స్ ఇలా

* Punjab Election Result 2022: పంజాబ్ ఎన్నికల ఫలితాలు (Trends)

AAP 89
INC 13
SAD+ 9
BJP+ 5

 

* Uttarakhand Election Result 2022: ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు (Trends)

BJP 44
INC 22
OTH 4
AAP 0

 

* Goa Election Result 2022: గోవా ఎన్నికల ఫలితాలు (Trends)

BJP 18
INC+ 13
TMC 5
OTH 4

 

* Manipur Election Result 2022: మణిపూర్ ఎన్నికల ఫలితాలు (Trends)

BJP 25
INC 12
OTH 12
NPP 11

ఆప్ హవా

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఆమ్‌ఆద్మీ దూసుకుపోతోంది. ఇప్పటికే 88 స్థానాలకు పైగా లీడింగ్‌లో ఉంది ఆప్. మరోవైపు నవజోత్ సింగ్ సిద్ధూ, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, వంటి హేమాహేమీలు వెనుకంజలో ఉన్నారు.

ఉదయం 10 గంటల సమయానికి పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ఆధిక్యం ఇలా..

పంజాబ్‌ (117)
AAP - 86
INC - 16
SAD+ - 9
BJP+  - 4

ఉత్తరాఖండ్ (70)
BJP - 44
INC - 20
OTH - 4
AAP - 0

గోవా (40)
INC+ - 16
BJP - 15
OTH - 4
TMC - 4

మణిపూర్ (60)
BJP - 23
INC - 14
OTH - 14
NPP - 9

Punjab Election Live: పంజాబ్‌లో జోరు మీదున్న ఆప్, ఏకంగా 70 స్థానాల్లో ముందంజ

AAP In Punjab: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా పంజాబ్‌లో ఆప్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 117 స్థానాలకు గానూ ఇప్పటికే 70కు పైగా స్థానాల్లో ఆప్‌ ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 20 స్థానాల్లో సత్తా చాటుతోంది.

Punjab Election Results: పంజాబ్‌లో మారిన సీన్, ఆధిక్యంలోకి ఆప్

Punjab Election Results Live: పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో తొలుత కాంగ్రెస్, ఆప్ మధ్య నువ్వా నేనా అంటూ పోటీ సాగింది. తాజాగా ఆప్ భారీ ఆధిక్యంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ 40 స్థానాల్లో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. శిరోమణి అకాళీదళ్ కూటమి 8 స్థానాలు, బీజేపీ కేవలం మూడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ పోటీ చేసిన రెండు చోట్లా ముందంజలో కొనసాగుతున్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ పటియాలా నుంచి పోటీ చేయగా.. ఆయన కూడా ముందంజలో ఉన్నారు.

Punjab Election Results: పంజాబ్‌లో ఆప్ - కాంగ్రెస్ నువ్వా నేనా!

ఉత్తరాఖండ్‌లో బీజేపీ 27 స్థానాల్లో, కాంగ్రెస్ 22 చోట్ల, ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్, ఆప్ మధ్య హోరాహోరీ నెలకొని ఉంది. ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ కూడా మరో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ పరస్ఫరం తలపడుతున్నాయి.

Election Counting Starts: ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.

5 States Elections Counting Updates: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సందడి, చేరుకుంటున్న పార్టీల ఏజెంట్లు

5 రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ మొదలుకానుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా అప్పుడే కౌంటింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓట్లు లెక్కించే సిబ్బంది సహా అభ్యర్థుల అనుచరులు, పార్టీల ఏజెంట్లు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్న సిబ్బంది, పార్టీల ఏజెంట్లు

 
Assembly Elections Counting Live: ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం, పటిష్ఠంగా భద్రత

Elections Results 2022 Live: దేశంలో ఇటీవల శాసనసభకు ఎన్నికలు (Five States Election Results) జరిగిన 5 రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand), గోవా (Goa), పంజాబ్ (Punjab), మణిపూర్‌ (Manipur) లో పోలింగ్ కౌంటింగ్ (Election Counting) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఈ ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో 75 సెంటర్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా 403 స్థానాల ఫలితాలు తేలనున్నాయి. పంజాబ్‌లో 66 లెక్కింపు కేంద్రాల్లో 117 స్థానాలకు చెందిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ ఓట్ల లెక్కింపు కోసం 13 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. గోవాలో 40, మణిపూర్‌లో 60 స్థానాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోని నేతల భవితవ్యం నేడు తేలనుంది.

Background

Five States Assembly Election Results Live: ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించింది.

యూపీపైనే దృష్టి (UP Election Results 2022)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో (5 State Election 2022 Results) యూపీపైనే అందరి దృష్టి ఉంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఫలితాల లెక్కింపు (UP Election Result Live) కోసం 75 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Assembly Elections Exit Poll Results)
ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh Election Result) సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Assembly Elections Exit Poll Results) విడుదల చేశాయి. ఏబీపీ- సీఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ వివరాలను ఓసారి చూద్దాం.

యూపీలో పువ్వు పార్టీ (BJP in UP)
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం యూపీలో మళ్లీ భాజపా సర్కార్ రానున్నట్లు తేలింది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికంగా భాజపాకు 40 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి (Samajwadi Party) 33 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) రంగంలోకి దిగినా కాంగ్రెస్ (Congress in UP) మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్‌ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. (UP Election Results)
403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో (UP Assembly) భాజపా మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. భాజపా 228 నుంచి 240 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. సమాజ్ వాదీ పార్టీ 132 నుంచి 148 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది. మాయావతి (Mayavati) బీఎస్పీ (BSP) మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 14 నుంచి 21 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 6 నుంచి 10 సీట్లకే సరిపెట్టుకోనున్నట్లు తేలింది.

పంజాబ్‌లో ఆప్ (AAP In Punjab)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి  ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) హవా కనిపించబోతోందని ABP-C voter సర్వేలో తేలింది. పంజాబ్‌లో 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ABP-C voter నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు కనిపించింది. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో తాజా అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 51 నుంచి 61 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 28  సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గోవాలో హంగ్ (Goa Election Results)
గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ (Goa Elections Exit Poll Results) ఫలితాల కాంగ్రెస్ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని అంచనా. బీజేపీ 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చు. ఆప్‌ స్థానాలు ఐదు వరకు పెరగవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఆప్‌ ఒకటి నుంచి ఐదు స్థానాల్లో పాగా వేసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఈసారి మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ ఇప్పుడు కీలకం కానున్నట్టు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకోనుందని అంచనా. ఇదే జరిగితే ఈ పార్టీవైపు ప్రధాన పార్టీలు చూస్తాయి. ఇతరలు కూడా ఒకట్రెండు స్థానాల్లో గెలవ వచ్చని సర్వే చెబుతోంది.  

ఉత్తరాఖండ్ (Uttarakhand Election Results)
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP-సీ ఓటర్ చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భాజపా 26- 32 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 32-38 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఆమ్‌ఆద్మీ 0-2 స్థానాలు గెలవొచ్చు. ఇతరులకు 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
 
మణిపుర్ (Manipur Election Results)
ఈ ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం మణిపుర్‌లో కాంగ్రెస్ 12 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని తేలింది. భాజపాకి 23 నుంచి 27 స్థానాలు ప్రజలు కట్టబెట్టి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ప్రజలు నిలబెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు, ఎన్ పీఎఫ్ 3 నుంచి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులు 2-6 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.