అన్వేషించండి

Election Results 2022 Live: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి భాజపా సర్కార్- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేయండి.

LIVE

Key Events
Election Results 2022 Live: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి భాజపా సర్కార్- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం

Background

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒక దశలో, గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

గుజరాత్లోని 37 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా... బీజేపీ దూసుకెళ్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో బీజేపీకి ఆధిక్యం లభించింది. 182 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 92. ఈసారి ఓటింగ్ శాతం 2012 కంటే తక్కువగా ఉంది. 2017లో గుజరాత్‌లో 68.39 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి 64.33 శాతం పోలింగ్ నమోదైంది. ద్రవ్యోల్బణం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడం, పెద్ద ప్రాజెక్టులకు భూసేకరణ, రైతుల సమస్యలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇషుదన్ గధ్వీ, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ సహా 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది. 

గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి విజయం సాధిస్తామన్న ధీమాతో బీజేపీ ఉంది. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం గుజరాత్ లో బీజేపీదే విజయం అని అంచనా వేశాయి. గుజరాత్‌లో బీజేపీకి 128-140 సీట్లు, కాంగ్రెస్‌ 31-43 సీట్లు, ఆప్‌కు 3-11 సీట్లు, ఇతరులకు 2-6 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సీ-వోటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల మంది భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు, ఇతర సహాయక సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 76.44 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది, కానీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది.

హిమాచల్ ప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ బిజెపి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 33 నుంచి 41 సీట్లు, కాంగ్రెస్ కు 24 నుంచి 32 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 0-4 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయని ఏబీపీ సర్వే అంచనా వేసింది.

'గుజరాత్లో బీజేపీ తన రికార్డును బద్దలు కొడుతుంది'

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోడీ మాట్లాడుతూ, "గుజరాత్ అంతటా బిజెపి తన రికార్డును బద్దలు కొడుతుంది. బీజేపీకి అత్యధిక శాతం వస్తుంది. ఈ మధ్యాహ్నం నాటికి మాకు ఫలితాలన్నీ తెలుస్తాయి. బీజేపీ పెద్ద ఎత్తున గెలుస్తుంది. బీజేపీ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేస్తోందని అన్నారు.

 ఎగ్జిట్ పోల్స్ విఫలం అవుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అన్నారు.

గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ వేవ్ ఉందని జిగ్నేష్ మేవానీ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ కు, దేశానికి కొత్త దిశను ఇస్తాయని, రాష్ట్రంలో మార్పు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు నిరంకుశత్వానికి, నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీకి 120 సీట్లు వస్తాయి. అన్నారు. 

17:32 PM (IST)  •  08 Dec 2022

ప్రధాని స్పందన

గుజరాత్ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు

[quote author=      ప్రధాని మోదీ]మా పార్టీకి నిజమైన బలం అయిన మా కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు.     [/quote]

16:53 PM (IST)  •  08 Dec 2022

సీఎం రాజీనామా

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ మార్కు దాటింది.

15:58 PM (IST)  •  08 Dec 2022

సీఎం అభ్యర్థి ఓటమి

ఆమ్‌ఆద్మీ గుజరాత్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గద్వీ 19 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

15:45 PM (IST)  •  08 Dec 2022

కొనసాగుతోన్న కౌంటింగ్

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటివరకు 16 స్థానాలను గెలుచుకుని.. 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించగా. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

15:08 PM (IST)  •  08 Dec 2022

సీఎం రాజీనామా

మరికొద్ది సేపట్లో గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు.

14:54 PM (IST)  •  08 Dec 2022

భారీ ఆధిక్యంలో డింపుల్

ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్.. 2,40,322 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ కొనసాగుతోంది.

14:39 PM (IST)  •  08 Dec 2022

జడేజా రోడ్‌ షో

జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రివాబా జడేజా తన భర్త, క్రికెటర్ రవీంద్ర జడేజాతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈసీ లెక్కల ప్రకారం రివాబా AAP అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై 50,456 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

14:14 PM (IST)  •  08 Dec 2022

అఖిలేశ్‌కు బూస్ట్

శివపాల్ సింగ్ యాదవ్.. తన పార్టీని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

[quote author=శివపాల్ సింగ్ యాదవ్]మేము ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)ని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేశాం. 2024లో ఐక్యంగా పోరాడతాం. నేటి నుంచి సమాజ్‌వాదీ పార్టీ జెండానే కారుపై ఉంటుంది. [/quote]

13:48 PM (IST)  •  08 Dec 2022

కాంగ్రెస్‌లో జోష్

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ మెజారిటీ 35 స్థానాలను అధిగమించడంతో కార్యకర్తలు పార్టీ దిల్లీ కార్యాలయం ముందు బాణసంచా పేల్చారు.

13:38 PM (IST)  •  08 Dec 2022

హిమాచల్ ప్రదేశ్

కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచి 39 చోట్ల ఆధిక్యంలో ఉంది. భాజపా 4 స్థానాల్లో గెలిచి 21 చోట్ల ఆధిక్యంలో ఉంది. లెక్కింపు కొనసాగుతోంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna at Legend 10Years | పసుపు చీరలో సోనాల్ చౌహాన్..కవిత చెప్పిన బాలకృష్ణ | ABPKTR Angry on Leaders Party Change | పార్టీ మారుతున్న బీఆర్ఎస్ లీడర్లపై కేటీఆర్ ఫైర్ | ABP DesamNandamuri Balakrishna at Legend 10Years | లెజెండ్ రీరిలీజ్ లోనూ 100రోజులు ఆడుతుందన్న బాలకృష్ణ | ABPBIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget