అన్వేషించండి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఏడు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏడుగురు బరిలో నిలబడితే... ఒక స్థానం కోసం టీడీపీ పోటీ పడింది.

ఎన్నికల సంఘం చెప్పిన సమయానికి కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం మూడు గంటల వరకు ఓటు వేసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలంతా ముందుగానే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా సాగింపోయింది ప్రక్రియ. 

175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివిధ కారణాలతో వివిధ రోజులుగా సభకు దూరంగా ఉంటున్న వాళ్లు కూడా అసెంబ్లీకి వచ్చి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. అలాంటి వారిలో ఒకరు గంటా శ్రీనివాసరావు అయితే రెండో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.

పార్టీల మైండ్‌గేమ్‌తో చాలా టెన్షన్ పెట్టిన ఎన్నికల ఫలితం నాలుగు గంటల తర్వాత తెలియనుంది. అప్పటి వరకు ఎవరు ఎటు వేశారు.. ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారంటూ అధికార పార్టీలో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ఈ ఎన్నికతో తెరదించాలని జగన్ భావిస్తున్నారు.   

ఎంతో చర్చకు దారి తీసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పూర్తైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి ఓటు వేయడంతో ప్రక్రియ ప్రారంభమైంది. ఓ వైపు అసెంబ్లీ నడుస్తుండగానే ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేసి వెళ్లారు. టీడీపీ సభ్యులంతా చంద్రబాబుతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి అంతా కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఏడు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏడుగురు బరిలో నిలబడితే... ఒక స్థానం కోసం టీడీపీ కూడా పోటీ పడింది. ఆ పార్టీ తరఫున పంచుమర్తి అనూరాధ పోటీలో నిలిచారు. వైసీపీ తరఫున బరిలో జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయరాజు ఉన్నారు. 

తనను నిండు శాసనసభలో అవమానించారని కన్నీళ్లు పెట్టుకన్న చంద్రబాబు... ఇకపై గెలిచే సభలో అడుగుపెడతానంటూ 2021 నవంబర్‌ 19న శపథం చేశారు. అన్నట్టుగానే అప్పటి నుంచి సభకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సభలో అడుగు పెట్టారు. 

వైసీపీ ఎమ్మెల్యే అప్పల నాయుడు కుమారుడి పెళ్లి ఉంది. ఆ పనుల్లో బిజిగా ఉన్న ఆయన కూడా వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఆయన  వైసీపీ స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేసింది. తన కుమారుడి పెళ్లిన అయిన తర్వాత స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చి ఓటు వేయించింది. 

ఉదయం నుంచి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. గంటా రాజీనామా ఆమోదించారని వార్తలు హల్ చల్ చేశాయి. చాలా కాలంగా శాసనభకు రాని ఆయన ఇవాళ వచ్చి ఓటు వేసి వెళ్లారు. తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

ఒక్క ఓటే కానీ చాలా ఎఫెక్టివ్‌
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసి ఉన్నా... చెల్లని ఓటు వేసినా ఉన్నా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తారు. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. ఇంకా కొంతమంది ఉన్నారని టాక్ నడుస్తోంది ఇలాంటి సమయంలో తేడా జరిగితే మాత్రం అధికార పార్టీకి పెద్ద దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అలాంటి ప్రమాదం రాకుండా అధికార వైసీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. నాలుగైదు మాక్ పోలింగ్‌లు నిర్వహించిది. తప్పు జరిగే అవకాశం లేకుండా అందరి ఎమ్మెల్యేలతో నేతలు మాట్లాడినట్టు సమాచారం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget