అన్వేషించండి

Andhra Pradesh Exit Poll : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ దెబ్బకొట్టిందా ? కడప సీటు కూడా అందుకే డౌట్‌లో పడిందా ?

ABP Cvoter Exit Poll 2024 : వైఎస్ఆర్‌సీపీ ని కాంగ్రెస్ , షర్మిల నష్టపరిచినట్లుగా కనిపిస్తోంది. కడప సీటు కూడా డౌట్‌లో పడినట్లుగా ఏబీపీ -సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడి కావడం దీనికి సంకేతం.

Andhra Pradesh Exit Poll :  ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గాలి వీస్తోందని వెల్లడయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు మొత్తం ఇరవై ఐదు సీట్లను స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే చెప్పారు. అయితే చాలా మంది కడప లోక్ సభ సీటులో వైఎస్ఆర్‌సీపీని ఎవరూ ఓడించలేరని భావిస్తున్నారు. కానీ ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ లో భిన్నమైన ఫలితం వస్తోంది.  

ఏపీలో ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీటు లేదని తేల్చిన ఎగ్జిట్ పోల్                                  

కూటమికి 21 నుంచి 25 సీట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. వైఎస్ఆర్‌సీపీ కి సున్నా నుంచి నాలుగు సీట్లలో చాన్స్ ఉంది. అంటే నాలుగు సీట్లలో మాత్రమే గట్టి పోటీ ఇస్తోంది.ఆ నాలుగు సీట్లలో కడప నియోజకవర్గం కూడా ఉండి ఉండవచ్చు. కడప ఇలా రిస్క్ లో పడటానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు షర్మిల అని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా అడుగు పెట్టిన ఆమె.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా పర్యటించారు. కడప లోక్ సభకు పోటీ చేశారు. కొంగు చాపి న్యాయం చేయాలని ప్రజల్ని అడిగి సెంటిమెంట్ రాజకీయాలు చేశారు. 

కడపలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన షర్మిల వల్ల ఎక్కువ నష్టం                                             

షర్మిల దూకుడుగా చేసిన రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ 3.3 శాతానికి చేరుకుంటుందని స్పష్టమయింది. గత ఎన్నికల్లో ఇది ఒక్క శాతం కూడా లేదు. కాంగ్రెస్‌కు పెరిగిన ప్రతి ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీదే. దళితులు, ముస్లింలు , గిరిజనుల్లో ఈ సారి కొంత కాంగ్రెస్ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది. ఇది వైసీపీని భారీగా దెబ్బతీస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ కు క్రైస్తవ వర్గాల్లో ఉన్న నెట్ వర్క్ కూడా ఇందుకు ఉపయోగపడిందని అనుకోవచ్చు. 

వైసీపీకి షర్మిల వల్ల కోలుకోలేని నష్టం జరిగిందా ?                     

కడప లోక్ సభ నియోజకవర్గంలో షర్మిల కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో భారీగా ఓట్లు పోలయ్యాయని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. షర్మిల గెలవలేకపోవచ్చు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం చేయడం ఖాయంగా  కనిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget