![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Andhra Pradesh Exit Poll : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ దెబ్బకొట్టిందా ? కడప సీటు కూడా అందుకే డౌట్లో పడిందా ?
ABP Cvoter Exit Poll 2024 : వైఎస్ఆర్సీపీ ని కాంగ్రెస్ , షర్మిల నష్టపరిచినట్లుగా కనిపిస్తోంది. కడప సీటు కూడా డౌట్లో పడినట్లుగా ఏబీపీ -సీఓటర్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి కావడం దీనికి సంకేతం.
![Andhra Pradesh Exit Poll : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ దెబ్బకొట్టిందా ? కడప సీటు కూడా అందుకే డౌట్లో పడిందా ? ABP Cvoter Exit Poll Has Congress and Sharmila damaged YSRCP In Kadapa Andhra Pradesh Exit Poll : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ దెబ్బకొట్టిందా ? కడప సీటు కూడా అందుకే డౌట్లో పడిందా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/6e724a4544e84bf17101ee1ab39e3a181717255549588228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh Exit Poll : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గాలి వీస్తోందని వెల్లడయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు మొత్తం ఇరవై ఐదు సీట్లను స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే చెప్పారు. అయితే చాలా మంది కడప లోక్ సభ సీటులో వైఎస్ఆర్సీపీని ఎవరూ ఓడించలేరని భావిస్తున్నారు. కానీ ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ లో భిన్నమైన ఫలితం వస్తోంది.
ఏపీలో ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీటు లేదని తేల్చిన ఎగ్జిట్ పోల్
కూటమికి 21 నుంచి 25 సీట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. వైఎస్ఆర్సీపీ కి సున్నా నుంచి నాలుగు సీట్లలో చాన్స్ ఉంది. అంటే నాలుగు సీట్లలో మాత్రమే గట్టి పోటీ ఇస్తోంది.ఆ నాలుగు సీట్లలో కడప నియోజకవర్గం కూడా ఉండి ఉండవచ్చు. కడప ఇలా రిస్క్ లో పడటానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు షర్మిల అని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా అడుగు పెట్టిన ఆమె.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా పర్యటించారు. కడప లోక్ సభకు పోటీ చేశారు. కొంగు చాపి న్యాయం చేయాలని ప్రజల్ని అడిగి సెంటిమెంట్ రాజకీయాలు చేశారు.
కడపలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన షర్మిల వల్ల ఎక్కువ నష్టం
షర్మిల దూకుడుగా చేసిన రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ 3.3 శాతానికి చేరుకుంటుందని స్పష్టమయింది. గత ఎన్నికల్లో ఇది ఒక్క శాతం కూడా లేదు. కాంగ్రెస్కు పెరిగిన ప్రతి ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీదే. దళితులు, ముస్లింలు , గిరిజనుల్లో ఈ సారి కొంత కాంగ్రెస్ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది. ఇది వైసీపీని భారీగా దెబ్బతీస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ కు క్రైస్తవ వర్గాల్లో ఉన్న నెట్ వర్క్ కూడా ఇందుకు ఉపయోగపడిందని అనుకోవచ్చు.
వైసీపీకి షర్మిల వల్ల కోలుకోలేని నష్టం జరిగిందా ?
కడప లోక్ సభ నియోజకవర్గంలో షర్మిల కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో భారీగా ఓట్లు పోలయ్యాయని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. షర్మిల గెలవలేకపోవచ్చు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)