అన్వేషించండి

DOST Seat Allotment: నేడే 'దోస్త్' మొదటి విడత సీట్ల కేటాయింపు, ఎన్ని గంటలకంటే?

DOST Seat Allotment: తెలంగాణలో 'దోస్త్' మొదటి విడత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ జూన్ 2న ముగియడంతో.. జూన్ 6న సీట్లను కేటాయించేందుకు ఉన్నత విద్యామండలి సన్నద్దమవుతోంది.

DOST Phase-1 Seat Allotment: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్' మొదటి విడత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ జూన్ 2న ముగియడంతో.. సీట్ల కేటాయింపును ఉన్నత విద్యామండలి సన్నద్ధమవుతోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6న 'దోస్త్' ఫేజ్-1 సీట్లను కేటాయించనున్నారు. జూన్ 6న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించనున్న మీడియా స‌మావేశంలో సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ బుర్రా వెంక‌టేశం, ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రితో పాటు దోస్త్ క‌న్వీన‌ర్ పాల్గొన‌నున్నారు. దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడతల్లో నిర్వహించే దోస్త్‌ కౌన్సెలింగ్ ద్వారా ఈ సీట్లను భర్తీచేయనున్నారు.

దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ-DOST) మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా మే 6న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 1 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇక మే 20 నుంచి జూన్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు మే 28, 29 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 6న సీట్లను మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6 నుంచి 12 మధ్య ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో మొత్తం 1066 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 4.49 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీచేస్తారు. 

దోస్త్' రెండో దశ ప్రవేశాలు ఇలా..

➥  రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 6 నుంచి 13 వరకు కొనసాగనుంది. (రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400)

➥  రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 6 నుంచి 14 వరకు అవకాశం కల్పించనున్నారు.

➥ ఫేజ్-2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ (PH/ CAP/NCC ): 13.06.2024.

➥  విద్యార్థులకు జూన్ 18న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥  సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

'దోస్త్' మూడో విడత ప్రవేశాలు ఇలా..

➥ ఇక చివరగా.. జూన్ 19 నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

➥ విద్యార్థులు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

➥  చివరి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూన్ 19 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.

➥ ఫేజ్-3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ (PH/ CAP/NCC ): 25.06.2024.

➥ విద్యార్థులకు జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥ సీట్లు పొందిన విద్యార్థులు జులై 3లోగా సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

➥ అన్ని విడతల్లో (ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3) సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయడానికి తేదీలు: 29.06.2024 - 05.07.2024.

➥ కళాశాలలో విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు: 01.07.2024 - 06.07.2024.

➥  జులై 8 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.

Notification (Telugu)

Notification (English)

DOST Schedule

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP EdCET 2026 Results: ఏపీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్
NEET UG 2026 Fee Refund: NEET UG 2026 అభ్యర్థులకు అలర్ట్! ఫీజు రీఫండ్ లింక్‌ యాక్టివేట్‌! ఇలా అప్లై చేసుకోండి!
NEET UG 2026 అభ్యర్థులకు అలర్ట్! ఫీజు రీఫండ్ లింక్‌ యాక్టివేట్‌! ఇలా అప్లై చేసుకోండి!
AP SSC Supplementary Exam Hall Tickets: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Embed widget