అన్వేషించండి

ICET 2023: త్వరలో మరో విడత ఐసెట్ కౌన్సెలింగ్, 'సెల్ఫ్ ఫైనాన్స్' విధానం అమలు

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి మరోవిడత ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి మరోవిడత ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈసారి రాష్ట్రంలో తొలిసారిగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నారు. ఇందులో మంజూరైన సీట్లకు సర్కారు నుంచి బోధనా రుసుములు వర్తించవు. తాజాగా 37 కళాశాలల్లో 3,060 ఎంబీఏ, 25 కళాశాలల్లో 2,700 ఎంసీఏ సీట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. త్వరలో వాటి భర్తీకి ప్రత్యేకంగా ఐసెట్ కౌన్సెలింగ్ జరపనున్నారు. 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అయితే అలా చేరిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ వర్తించదు. 

వాస్తవానికి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కింద ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్ సీట్లను మంజూరు చేయాలని సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఎన్నికల సమయం కావడం, విద్యార్థులకు బోధనా రుసుములు ఎత్తివేస్తున్నారనే విమర్శలు వస్తాయనే భావనతో వెనకడుగు వేసింది. రాష్ట్రంలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు వార్షిక ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిగా.. మిగిలిన వారికి రూ.35 వేల వరకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తున్నారు. కొత్తగా మంజూరైన సీట్లకు మాత్రం ఫీజు మొత్తాన్ని విద్యార్థులే భరించాలి.

విచారణ ఉండగానే..
ఎంబీఏ, ఎంసీఏ సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ కొద్ది నెలల క్రితమే అనుమతిచ్చింది. ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. సీట్లపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబరు 9న మళ్లీ విచారణ ఉండగా.. ఈలోపే కొత్త సీట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వాటికి జేఎన్‌టీయూహెచ్, ఓయూ తదితర వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వగానే మరో విడత ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసి 10 రోజులవుతోంది. కొత్త సీట్లు మంజూరైన నేపథ్యంలో ఇటీవల కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారితోపాటు ఐసెట్‌లో ఉత్తీర్ణులైన వారూ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

ఎంబీఏకు డిమాండ్..
సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరిన వారి కంటే ప్రొఫెషనల్ కోర్సులైన బీటెక్, ఎంబీఏ, ఎంఫార్మసీ తదితర వాటిని పూర్తి చేసిన వారికి త్వరగా కొలువులు దక్కుతాయనే భావన ఉంది. సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలు ఇంజినీర్లనే కాకుండా అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్ తదితర పలు విభాగాల్లో ఎంబీఏ విద్యార్థులను నియమించుకుంటున్నాయి. బీటెక్ విద్యార్థులు సైతం ఎంబీఏకు పెద్దసంఖ్యలో పోటీపడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

Website

ALSO READ:

GATE - 2024 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2024 దరఖాస్తు గడువును ఐఐఎస్సీ-బెంగళూరు మరోసారి పొడిగించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా అక్టోబర్‌ 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌తో రూ.500 ఆలస్యరుసుముతో అక్టోబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget