TS Inter Results 2022 Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల, మళ్లీ బాలికలే టాప్ - వెంటనే ఇలా చెక్ చేస్కోండి
Telangana Inter Results కి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. రిజల్ట్స్ విడుదలయ్యాక telugu.abplive.com వెబ్ సైట్ నుంచి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
LIVE

Background
ఎల్లుండి తెలంగాణ టెన్త్ ఫలితాలు
ఎల్లుండి(గురువారం) తెలంగాణ పదోతరగతి ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం- 14 లక్షల విలువై ఆస్తి నష్టం
పెయింట్ & కెమికల్స్ కంపెనీలో కెమికల్ ప్రాసెస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో కంపెనీ తగలపడిపోయిన ఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో "లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్" అనే పెయింట్ & కెమికల్స్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలో పనిచేసే ఇద్దరు కార్మికులు కెమికల్స్ ప్రాసెస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో పెను ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన కార్మికులు అక్కడి నుంచి తప్పించుకోవడంతో పెను ముప్పు తప్పింది.
కంపెనీలోని మిషనరీ, ఇతర సామాగ్రి బూడిదయ్యాయి. పెద్ద ఎత్తున పొగలు రావడంతో స్దానికులు భయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ 2 ఫైర్ ఇంజన్ల సహయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు 14 లక్షల మేర ఆస్దినష్టం జరిగిందని కంపెనీ ఓనర్ శ్రీనివాస్ తెలిపారు. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో అగ్ని కీలలు వ్యాపించాయని లేకుంటే వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేవారిమని విజయ్ అనే కార్మికుడు తెలిపాడు.
Telangana Inter Results Links: ఇంటర్ రిజల్ట్స్ ఈ లింక్స్ ద్వారా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల అయ్యాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in వెబ్ సైట్స్లో చెక్ చేసుకోవచ్చు. కింది లింక్స్ లో కూడా చూడొచ్చు.
Telangana Inter Pass Percentage District wise: ఇంటర్ ఉత్తీర్ణత శాతంలో టాప్ జిల్లాలు ఇవే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ జిల్లా 76 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హన్మకొండలో 74 శాతం మంది పాసయ్యారు. ఇక సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ 78 శాతంతో తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (77 శాతం) ఉంది.
Inter Second Year Results: ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం ఇలా
ఇంటర్ సెకండ్ ఇయర్ విషయంలో 4,63,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,95,949 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో ఏ గ్రేడ్ సాధించిన వారు 1,59,422 మంది ఉన్నారు. బీ గ్రేడ్ సాధించిన వారు 82,481 మంది ఉన్నారు. మొత్తానికి 67.82 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అమ్మాయిలు సెకండ్ ఇయర్ లో 2,16,389 మంది పరీక్ష రాయగా.. 1,64,172 మంది (75.86 శాతం) పాసయ్యారు. 2,19,981 మంది పరీక్ష రాయగా.. 1,32,777 మంది (60 శాతం) పాసయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

