అన్వేషించండి

TS SSC Exams 2022 : తెలంగాణ పదో తరగతి పరీక్షల సమయం పెంపు, అదనంగా 30 నిమిషాలు!

TS SSC Exams 2022 : పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్ష సమయాన్ని ప్రతీ పేపర్ కు 30 నిమిషాలు పొడిగించింది.

TS SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షల సమయాన్ని 30 నిమిషాలు పొడిగించాలని ఎస్ఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల సమయాన్ని మరో అరగంట పొడిగిస్తున్నట్లు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు. మూడు గంటల పదిహేను నిమిషాలు పరీక్ష సమయం ఉంటుందని అధికారుల సమావేశంలో మంత్రి తెలిపారు.  

మరో 30 నిమిషాలు పెంపు 

 తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల సూచనల మేరకు ప్రతీ పరీక్షకు 30 నిమిషాలు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకూ 2 గంటల 45 నిమిషాల పాటు ఉండగా, ఇప్పుడు 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్‌ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప‌రీక్ష స‌మ‌యాన్ని అదనంగా 30 నిమిషాలు పొడిగించారు. అలాగే 6 పేపర్లతోనే ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే 70 శాతం సిల‌బ‌స్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నట్లు బోర్డు గతంలోనే ప్రకటించింది. క‌రోనా కారణంగా తరగతులు ఆల‌స్యం కావ‌డంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టెన్త్ పరీక్షల తేదీలు 

  • మే 23 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్ ఏ -(ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1 - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2  - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 24 - సెకండ్ లాంగ్వేజ్ -(ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 25- థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 26- మ్యాథమెటిక్స్‌ - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 27- జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 28- సోషల్‌ స్టడీస్‌ - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 30- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1 (సంస్కృతం, అరబిక్‌)- (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
  • జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ) - ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget