By: ABP Desam | Updated at : 11 Nov 2022 07:15 AM (IST)
రెండో శనివారం సెలవు రద్దు
రెండో శనివారం రోజు సాధారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. కానీ.. ఈ నెలలోని రెండో శనివారం (నవంబరు 12) లో మాత్రం సెలవును అధికారులు రద్దు చేశారు. అయితే .. ఈ సెలవు రాష్ట్రం మొత్తానికి వర్తించదు.. కేవలం హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు మాత్రమే నవంబరు 12న పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవులగా ప్రకటించింది. అందుకు బదులుగా నవంబరు 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రానున్న సెలవులు ఇవే..
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
♦ వేసవి సెలవులు ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రానున్న సెలవులు ఇవే..
♦ క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు.
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
♦ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.
'టెన్త్' పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం, అధికారిక ఉత్తర్వులు జారీ!!
తెలంగాణ పదోతరగతి పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా ఆరు పేపర్లతోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం 2022-23 కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వల్ల గత విద్యాసంవత్సరంలో 11 పేపర్లకు బదులు ఆరు పేర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.
పదోతరగతి పరీక్ష ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం, ఆలస్య రుసుముతో చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫీజును ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం నవంబరు 15 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లకు ఫీజును చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. ఇక రూ.50 ఆలస్యరుసుముతో నవంబర్ 30 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 15 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు తేదీల్లో ఏమైనా సెలవులు వస్తే.. మరుసటిరోజు ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు నుంచి వీరికి మినహాయింపు..
కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.24,000 కు మించకూడదు, అలాగే గ్రామాల్లో ఆదాయం రూ.20,000 మించకూడదు లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్/ 5 ఎకరాల డ్రై ల్యాండ్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
JEE Main 2024: జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్కు నేటితో ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా
AIBE: వెబ్సైట్లో ఏఐబీఈ-18 పరీక్ష అడ్మిట్ కార్డులు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
Merit Scholarship: వెబ్సైట్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష హాల్టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్ కోర్సుల్లో సరికొత్త సిలబస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>