అన్వేషించండి

Andhra Pradesh: విద్యార్థినులకు పీరియడ్స్‌ సెలవు - ఏపీలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీలో అమలు

Menstrual Leave Policy: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ తమ విద్యార్థినులకు నెలసరి సెలవులు మంజూరుచేయాలని నిర్ణయించింది. నెలలో ఒకరోజు సెలవు ఇవ్వనుంది.

DSNLU Visakhapatnam Introduces Menstrual Leave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ (DSNLU) విద్యార్థినులకు పీరియడ్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ఇవ్వనుంది. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థినులు కేవలం ఈమెయిల్‌ ద్వారా సమాచారమిస్తే చాలు.. ఈ ప్రత్యేక సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించింది. 

పీరియడ్ సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. తమకు నెలసరి సమయంలో ప్రత్యేక సెలవు ఇవ్వాలంటూ.. యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజిస్ట్రార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులకు సెలవు ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. 

ఇప్పటికే 7 లా యూనివర్సిటీల్లో అమలు..
దేశంలోని 7 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు పీరియడ్ సెలవుల విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ; ముంబయి, ఔరంగాబాద్‌లలోని మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, జబల్‌పూర్‌లోని ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, అసోంలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యుడిషియల్‌ అకాడమీల్లో ఈ విధానం అమలుచేసున్నాయి. ఈ విధానాన్ని అమలు చేయనున్న 8వ యూనివర్సిటీగా దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా వర్సిటీ నిలిచింది. 

ఇటీవల సుప్రీంకోర్టు ఏమందంటే?
నెలసరి సమయంలో మహిళలకు సెలవుల అంశంపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. విషయం సుప్రీంకోర్టు వరకూ చేరింది. మహిళలకు నెలసరి సమయంలో పూర్తిగా సెలవు ఇవ్వడం అనేది వారి బలహీనతకు చిహ్నంగా కనిపిస్తుందని ఒక వర్గం అంటుంటే.. ఈ రోజుల్లో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే వారికి మేలు జరుగుతుందని మరో వర్గం వాదిస్తోంది. ఇటీవల ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే ఈ చర్చకు కారణం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే, అది వారి ఉద్యోగావకాశాలకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. 

ఒకవైపు మహిళలకు పీరియడ్ సెలవులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే.. మరోవైపు దీనివల్ల వారిపై పడే ప్రభావాన్ని కోర్టు వివరించే ప్రయత్నం చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారి ఉపాధి అవకాశాలపై ప్రభావం పడొచ్చని తెలిపింది. నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళల ప్రయోజనాల కోసం తాము చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు బెంచ్ గుర్తు చేసింది. కాబట్టి ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. దీనిపై కేంద్రాన్ని ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. అలాగే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి దీనిపై ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget