అన్వేషించండి

CLAT Result 2021: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ - 2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ - 2021 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. క్లాట్ అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

CLAT 2021 Results: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (Common Law Admission Test- CLAT)- 2021 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది. క్లాట్ అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. క్లాట్- 2021 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 30న మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. క్లాట్ పరీక్షకు హాజరైన వారు.. consortiumofnlus.ac.in/clat-2021/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ దేశవ్యాప్తంగా జూలై 23వ తేదీన క్లాట్ పరీక్షను నిర్వహించింది. దీని ద్వారా గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 82 నగరాల్లోని 147 పరీక్ష కేంద్రాల్లో క్లాట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు గానూ మొత్తం 70,277 మంది రిజిస్ట్రర్ చేసుకోగా.. 66,887 మంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో 62,106 మంది పరీక్షలకు హాజరయ్యారు. 

'కీ'పై అభ్యంతరాలు..
క్లాట్ ఎగ్జామినేషన్ ఫైనల్ 'కీ'ని జూలై 27వ తేదీన విడుదల చేశారు. ఈ 'కీ'పై పలు అభ్యంతరాలు వెల్లడయ్యాయి. క్లాట్ పీజీ ఎగ్జామ్ 'కీ'లో మొత్తం 120 ప్రశ్నలు ఉండగా.. 11 ప్రశ్నలపై 24 అభ్యంతరాలు వచ్చాయి. ఇక క్లాట్ యూజీ ఎగ్జామ్ 'కీ'లో 61 ప్రశ్నలకు సంబంధించి దాదాపు 1026 అభ్యంతరాలు వెల్లడయ్యాయి. 
మార్కులు తెలుసుకోండిలా..
1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in ను క్లిక్ చేయాలి. 
2. క్లాట్ 2021 డిటైల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
3. మొబైల్ నంబరు, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. 
4. లాగిన్ అయ్యాక స్క్రీన్ మీద క్లాట్ 2021 స్కోర్ కార్డు కనిపిస్తుంది. 
5. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
ఆగస్టు 1న సీట్లు కేటాయింపు..
క్లాట్ ద్వారా సీటు పొందాలనుకున్న అభ్యర్థులు రూ.50000 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ సీట్ల కేటాయింపు వివరాలను ఆగస్టు 1వ తేదీన విడుదల చేస్తుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు.. తమ సీట్లను ఆగస్టు 5వ తేదీ లోగా కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్లను కన్ఫామ్ చేసుకునేందుకు అభ్యర్థులు ఎన్ఎల్‌యూ (consortiumofnlus.ac.in ) వెబ్ సైట్‌కు వెళ్లి అందులో యాక్సెప్ట్ లేదా లాక్ ద సీట్ అనే ఆప్షన్ ఎంచుకున్నాక.. డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. దీంతో సీట్ కన్ఫామ్ అవుతుంది. ఇక రెండో దశ సీట్ల కేటాయింపు లిస్టును ఆగస్టు 9వ తేదీన, మూడో అలాట్ మెంట్ లిస్టును ఆగస్టు 13న విడుదల చేయనుంది. 
కాగా, గతేడాది క్లాట్- 2020 పరీక్షకు మొత్తం 75,183 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 68,833 మంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో 86.20 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ISRO Scientists Resign:ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget