అన్వేషించండి

Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Inter exams: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలను అధికారులు ఖరారు చేశారు. మార్చి 1 నుంచి 20 మధ్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

AP INTER EXAMS: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల(Inter exams) నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. మార్చి 1 నుంచి 20వ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా.. అంటే ఫిబ్రవరి 1,3 తేదీల్లో మానవ విలువలు-నైతికత (Human Values and Ethics) పరీక్షలు, మార్చి 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఇంటర్ పరీక్షలకు షెడ్యూలును అధికారికంగగా ప్రకటించనున్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం కావాలని ఇంటర్‌బోర్డు అధికారులు సూచించారు. ఈ మేరకు బోర్డు పరిధిలోని కళాశాలలను పరీక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇంటర్ బోర్డు అప్రమత్తం చేసింది. పరీక్షల్లో ప్రతిభ చూపి ఎక్కువ మార్కులు సాధించాలని పిలుపునిచ్చారు. 

ఫీజు చెల్లింపునకు 15 వరకు అవకాశం..
ఇంటర్‌ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 15 వరకు గడువు పొడిగించారు. ఇంటర్‌ (జనరల్‌, ఒకేషనల్‌) ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులు, ప్రైవేట్‌ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలి. విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి ఇదే చివరి అవకాశం.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్..
ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్‌‌ను అమలు చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్‌ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్‌ సిలబస్‌ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. 

12 ఏళ్లుగా పాత సిలబస్సే..
రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్‌ను మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్మీడియట్‌లో మాత్రం దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్‌నే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ విద్యా విధానంలో భాగంగా.. వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు. ప్రస్తుతం ఇంటర్‌లో బోధిస్తున్న సిలబస్‌ను 2011–12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు  పాతబడిపోవడం, సైన్స్‌ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్‌డేట్‌ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్‌ బోధిస్తూ, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6–10 తరగతుల వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. 

పరీక్షల విధానంలోనూ మార్పులు..
ఇంటర్‌ బోర్డు కమిషనర్, కార్యదర్శిగా కృతికా శుక్లా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. విధుల్లో చేరగానే కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. అదేవిధంగా యూనిట్‌ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారుచేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్‌ టెస్ట్‌ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్‌ టెస్ట్‌ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్‌ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్‌ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్‌ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.

ALSO READ:

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు - చివరితేదీ ఎప్పుడంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP DesamCSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
Embed widget