అన్వేషించండి

AP ECET: ఏపీఈసెట్‌ - 2024 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం - రిజిస్ట్రేషన్‌, వెబ్‌ఆప్షన్లు, సీట్ల కేటాయింపు వివరాలు ఇలా

AP ECET: ఏపీలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈసెట్ (ఇంజినీరింగ్) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 26న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

AP ECET 2024 Couselling: ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు సంబంధించిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 26న  ప్రారంభమైంది. ఈసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 26 నుంచి 30 మధ్య రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు జూన్ 27 నుంచి జులై 3 మధ్య ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 5న వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులకు జులై 8న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జులై 9 నుంచి 15 మధ్య  సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 10 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 

ఏపీ ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 32,881 మంది (90.41 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో బాలురు 89.35 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 93.34 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.

ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన కౌన్సెలింగ్ మాత్రమే ప్రారంభమైంది. అయితే డిప్లొమో ఇన్‌ ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అకడమిక్‌ ప్రక్రియ పూర్తి కానందు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్: 26.06.2024 - 30.06.2024.

➥ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 27.06.2024 - 03.07.2024.

➥ వెబ్ఆప్షన్ల నమోదు: 01.07.2024 - 04.07.2024.

➥ వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం: 05.07.2024.

➥ సీట్ల కేటాయింపు: 08.07.2024.

➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 09.07.2024 - 15.07.2024.

➥ తరగతులు ప్రారంభం: 10.07.2024.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కావాల్సినవి ఇవే..

➥ పదోతరగతి మార్కుల మెమో

➥ డిప్లొమా/డిగ్రీ మార్కుల మెమో

➥ 7వ తరగతి నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్లు (డిప్లొమా వారైతే) లేదా 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు సర్టిఫికేట్లు (డిగ్రీ వారైతే)

➥ క్యాస్ట్ సర్టిఫికేట్

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)

➥ లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (ఫీజ రీయింబెర్స్ అర్హత కోసం)

➥ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్

➥ రెసిడెన్స్ సర్టిఫికేట్

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం ఏపీఈసెట్ 2024 నోటిఫికేషన్ మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే.  అభ్యర్థుల నుంచి మార్చి 15 నంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 8న ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మే 30న ఫలితాలను వెల్లడించారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంజినీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 26న ప్రారంభమైంది.

Counselling Notification

Candidate Registration

Know Your Payment Status

Print Your Application Form

Know Your HLC

Website

ALSO READ: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget