అన్వేషించండి

Visakha Crime News: తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - ప్రేమ వ్యవహారమే కారణం

Visakha Crime News: నువ్వు నాతో ఉంటే నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నా పక్కన లేకపోతే ఒంటరిననిపిస్తోందంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Visakha Crime News: నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోందంటూ తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్ చూస్తుంటేనే అతడేదో ప్రేమ వ్యవహారం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అతడి వయసు 16 ఏళ్లే ఉండడం, అందులోనూ తొమ్మిదో తరగతే చదవడం మరింత బాధాకరం

విశాఖ పట్టణంలోని గాజువాకలోని కైలాస్ నగర్ కు చెందిన 16 ఏళ్ల బాలుడు అఖిల్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే అఖిల్ మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ లభించింది. నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకెవరూ వద్దనిపిస్తోందని.. నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోందని రాసి పెట్టాడు. ఇది చూసిన పోలీసులు ప్రేమ వ్యవహారమే బాలుడి ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోందని అంటున్నారు. 

ఇటీవలే విశాఖ బీచ్ లో దూకి తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ విద్యార్థి అదృశ్యం కేసు విషాందగా మారింది. వైజాగ్ లో కనిపించకుండా పోయిన విద్యార్థి కథ దుఃఖాంతమైంది. హైదరాబాద్ ఐఐటీలో చదువుకుంటున్న కార్తీక్.. ఈనెల 17వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో స్నేహితులు, తల్లిదండ్రులు ఇలా ఎవరు ఫోన్ చేసిన స్పందన లేదు. రెండు, మూడు రోజుల పాటు చూసిన తల్లిదండ్రులు కాలేజీకి, అతను ఉండే హాస్టల్ కు ఫోన్ చేశారు. ఎక్కడా అతడి సమాచారం లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలేజీతోపాటు అతని స్నేహితులను కూడా విచారించారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో.. అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. ఇలా కార్తీక్ విశాఖపట్నం వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కార్తీక్ విశాఖ బీచ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. అయితే కార్తీక్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఇంకా తెలియరాలేదు. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

నిన్నటికి నిన్న యూట్యూబ్ చూస్తూ బాలుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 11 ఏళ్ల ఉదయ్ కుమార్ అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడికి తల్లిదండ్రుల సెల్ ఫోన్ లో వీడియోలు చూసే అలవాటు ఉంది. రోజూలాగే శనివారం రోజు రాత్రిపూట భోజనం చేశాడు. అనంతరం ఫోన్ తీసుకొని ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. విషయం గుర్తించని తల్లిదండ్రులు భోజనం చేసి ఇతర పనులు చేసుకున్నారు. బాలుడు చాలా సేపు అవుతున్నా బయటకు రాకపోవడంతో.. తల్లిదండ్రులు చాలా సేపు పిలిచారు. అయినప్పటికీ చడీచప్పుడు లేకపోవడంతో తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఉదయ్ ఉరి వేసుకొని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అది చూసిన తల్లిదండ్రులకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా కేకలు వేస్తూ ఏడ్వడంతో స్థానికులంతా వచ్చారు. తలుపులు పగులగొట్టి బాలుడిని నేరుగా ఆస్పత్రికి తరలించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే స్థానికులు పోలీసులకు కూడా సమాచారం అందించగా.. హుటాహుటాన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం ఉదయ్ మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Embed widget