జులై 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. బంగాళాఖాతంలో వాతావరణం దారుణంగా మారడంతో వారి బోటు బోల్తా పడింది.
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Fishermen Missing:విశాఖ తీరంలో వారం రోజుల క్రితం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. ఆచూకీ లభించని వారంతా చనిపోయినట్టు అందులో పేర్కొంది.

- విశాఖలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు ప్రమాదం.
- ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఆరుగురు గల్లంతై మరణించారు.
- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ₹10 లక్షల సాయం ప్రకటించింది.
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో వారం రోజుల క్రితం ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేట పూర్తి అయిన తర్వాత వస్తున్న క్రమంలో వారి బోటు ప్రమాదానికి గురైంది. అంతే అందులో ఒక వ్యక్తి ఈదుకుంటూ విదేశ నౌకను పట్టుకొని బయటపడ్డాడు. మిగతా ఆరుగురు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం నాలుగు రోజులుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వారంతా చనిపోయినట్టు గుర్తించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
విశాఖ తీరంలో వేటకు వెళ్లి గల్లంతైన వారి ఉదంతం విషాదంతో ముగిసింది. జులై 1న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. వేట పూర్తి అయిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు దారుణంగా మారాయి. ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మరికాసేపట్లో ఒడ్డుకు వచ్చేస్తున్నామని సమాచారం ఇచ్చారు. అయితే వాతావరణం బాగాలేదని కూడా వారి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన కాసేపటి తర్వాత వారి ఫోన్లు పని చేయడం మానేశాయి.
వాతావరణ పరిస్థితులు కారణంగా వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఆ ఏడుగురు ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా సమయం బోటుపై ఉండేందుకు యత్నించారు. కానీ అది పూర్తిగా మునిగిపోవడంతో తప్పనిసరిగా ప్రాణాలు కాపాడుకునేందుకు ఈదాల్సి వచ్చింది. రాత్రంతా వారు ఈదుతూనే ఉన్నారు. అయితే అందులో ఒకరు మాత్రం నడిసంద్రంలో ఉన్న ఒక ఓడను చూశాడు. అతను అతికష్టమ్మీద ఆ ఓడ వద్దకు చేరుకున్నాడు. నౌకాసిబ్బంది అతన్ని రక్షించి అధికారులకు సమాచారం అందించారు. అతనే కారీ చిన్న.
మిగతా వారు మాత్రం ఈద లేకపోయారు. దీంతో వారు గల్లంతయ్యారు. తనతో వచ్చిన ఆరుగురు ఆచూకీ లభించడం లేదని చిన్న చెప్పిన సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇండియన్ నేవీ, కోస్ట్గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు వారి కోసం విస్తృతగా గాలింపు చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వారిని గుర్తించే పని చేపట్టారు. కానీ అది సాధ్యం కాలేదు.
చివరకు ముగ్గురు సభ్యులతో వేసిన కమిటీ రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గల్లంతైన వారంతా చనిపోయినట్టు అందులో పేర్కొంది. తమ వారు ప్రాణాలతో ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉంటారని ఎంతో ఆశగా ఎదురు చూసిన కుటుంబాలకు నిరాశ తప్పలేదు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే వారి కాళ్ల కింద భూమి కుంగిపోయింది. ఒక్కసారిగా గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయిన తమను ఆదుకునేవారు ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఘోర విపత్తుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల సాయం ప్రకటించింది. మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్తో మాట్లాడి వెంటనే బాధితులకు అందజేయాలని ఆదేశించారు. ఈ ఉదయం మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ టైంలో అక్కడ కొందరు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి నచ్చజెప్పి బాధితులను పరామర్శించారు. వారి దుస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున కచ్చితంగా అందర్నీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Frequently Asked Questions
విశాఖ తీరంలో మత్స్యకారులకు ఏం జరిగింది?
ఈ ఘటనలో ఎంతమంది మత్స్యకారులు గల్లంతయ్యారు?
ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారుల్లో కారీ చిన్న అనే వ్యక్తి ఒక విదేశీ నౌకను పట్టుకుని బయటపడ్డారు. మిగతా ఆరుగురు మత్స్యకారులు గల్లంతై చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.
గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించింది?
రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర బాధితులను పరామర్శించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















