అన్వేషించండి

Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణం, బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక లైంగికదాడి!

Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వినాయక చవితి వేడుకల్లో ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. బాలికకు మత్తు మందు ఇచ్చి దారుణానికి పాల్పడ్డారు.

Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి ఊరేగింపులో 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. బాలికకు మత్తు మందు ఇచ్చి నిర్మానుష ప్రదేశంలోకి ఎత్తుకెళ్లిన యువకులు, బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 

అసలేం జరిగింది? 

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడంతో వాడవాడల వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా గణపతి నామస్మరణలతో మారుమోగుతుంది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఊరేగింపును వీక్షించేందుకు వచ్చిన బాలికపై కొందరు యువకులు కన్నేశారు. వైభవంగా సాగుతున్న వినాయక చవితి వేడుకల్లో అందరి కళ్లు కప్పి ఎలాగైనా బాలికను ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేశారు. అనుకున్న విధంగానే పక్కా స్కెచ్ తో విగ్రహ ప్రతిష్ఠ యాత్ర చేస్తున్న సమయంలో బాలికకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా అదును చూసి బాలికను పక్కనే ఉన్న నిర్మానుష ప్రదేశంలోనికి తీసుకెళ్లిన యువకులు, బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.  

తిరుపతిలో దారుణం 

తిరుపతి జిల్లాలోని ఓ గ్రామంలో వినాయక ప్రతిష్ట ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామస్థులు. ఆ ఊరేగింపును చూసేందుకు గ్రామ ప్రజలంతా ఇంటి నుంచి బయటకు వచ్చారు. అందరూ స్వామి వారి విగ్రహం ఎలా ఉంది అని చూసే పనిలో నిమగ్నం అయ్యారు. ఇంతలోనే ఓ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. కొందరు యువకులు ఒంటరిగా ఇంటి బయట ఉన్న బాలికపై కన్ను వేశారు. అనుకున్నదే తడువుగా పక్కా ప్లాన్ అమలు చేశారు. ఈ ప్లాన్ లో‌ భాగంగా ఓ యువకుడు బాలిక వైపు వెళ్లి మత్తు ఉన్న ఇంజక్షన్ ఇచ్చాడు. చీమ కుట్టినట్లు ఉండటంతో ఆ బాలిక పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నిమిషాల్లో ఆ బాలిక మెల్లగా మత్తులోకి జారుకుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ కామాంధులు విగ్రహ ప్రతిష్టకు కాసంత దూరంలోని నిర్మానుష ప్రదేశంలోకి బాలికను ఎత్తుకెళ్లారు. ఒకరి తరువాత మరొకరు బాలికపై లైంగిక దాడి చేశారు. అత్యాచారం అనంతరం బాలికను అక్కడే వదిలి పెట్టి వెళ్లిపోయారు యువకులు. 

పరారీలో ముగ్గురు యువకులు 

కొంత సేపటికి స్పృహలోకి వచ్చిన బాలిక నేరుగా ఇంటికి చేరుకుని, జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి, అమ్మమ్మ కేవీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా మొత్తం ముగ్గురు యువకులు బాలికపై లైంగికదాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక గ్రామంలో మరి కొందరు యువకులను సైతం పోలీసులు విచారించారు. అయితే నిందితులైన యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, వైద్య పరీక్షల నిర్వహించిన వైద్యులు బాలిక కొంత నీరసించి ఉందని వెల్లడించారు. బాలికను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే నిందుతులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుల కోసం బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : Tammineni Krishnaiah Murder Case: తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ట్విస్ట్, కోర్టులో లొంగిపోయిన నిందితులు

Also Read : Gas Cylinders Explosion: ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, లారీలో ఒక్కసారిగా పేలిన వందల సిలిండర్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Samantha Raj Nidimoru: భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Embed widget