అన్వేషించండి

Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణం, నెలరోజులుగా వివాహితను ఇంట్లో బంధించి అత్యాచారం

Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల పాటు వివాహితను బంధించి అత్యాచారాని పాల్పడ్డాడో వ్యక్తి.

Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ వివాహితను నాగరాజు అనే వ్యక్తి రెండు ప్రాంతాల్లో నిర్బంధించి నెల రోజులు పాటు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివాహిత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తిరిగి వివాహిత నివసిస్తున్న గ్రామంలో వదిలి పెట్టాడు.  

అసలేం జరిగింది? 

తిరుపతి జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఓ వివాహిత తిరుపతి రూరల్ మండలంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. తిరుపతిలోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది.  అయితే చిగురువాడ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నవంబర్ 17న వివాహిత పని చేస్తున్న పాఠశాల వద్దకు వెళ్లాడు. వివాహితకు బ్యాంకు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన వివాహిత నాగరాజును ప్రతిఘటించడంతో నాగరాజు ఆమెపై దాడి చేశాడు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పాకాల మండలం దామలచెరువులోని ఓ ఇంట్లో నిర్బంధించాడు. మళ్లీ పలుమార్లు అత్యాచారం చేశాడు. వివాహిత చనిపోతానని చెప్పడంతో భయపడ్డ నాగరాజు ఆమెను స్వగ్రామంలో వదిలిపెట్టాడు. 

మహిళ ఆత్మహత్యాయత్నం

మానసికంగా కుంగిపోయిన వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అడ్డుకుని ధైర్యం చెప్పారు. గ్రామస్తులు సహకారంతో జనవరి 6న  తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది వివాహిత. ఎస్పీ దిశ పోలీసులకు కేసును బదిలీ చేశారు. డీఎస్పీ రామరాజు కేసుపై నిర్లక్ష్యం వహించి, నిందుతుడిపై‌ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో బాధితురాలు బంధువుల సహాయంతో డీఎస్పీని వేడుకున్నా ఏమాత్రం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం చేయాలని దళిత సంఘాలు నేతలతో కలిసి చంద్రగిరిలో మీడియాతో గోడు చెప్పుకున్నారు.

యూపీని వణికిస్తున్న సీరియల్ కిల్లర్

యూపీలోని బరబంకి ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. మహిళలనే టార్గెట్ చేస్తూ హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ అక్కడే తిరుగుతున్నాడని తెలిసి భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఆరు పోలీస్ బృందాలు కిల్లర్ కోసం గాలిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిందితుడి ఫోటో షేర్ చేశారు. గుర్తించిన వారెవరైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు చెప్పారు. ఇప్పటికే ముగ్గురు మహిళలను దారుణంగా చంపేశాడు నిందితుడు. గతేడాది డిసెంబర్ 5న అయోధ్య జిల్లాలో ఖుషేటి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఏదో పని మీద బయటకు వచ్చింది. సాయంత్రం మళ్లీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు పెట్టారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు...డిసెంబర్ 6న ఓ చోట ఆమె మృతదేహం కనిపించింది. శరీరంపై బట్టలు లేవని, ముఖంపై తీవ్రంగా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అయితే...ఆ మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఆ తరవాత కొద్ది రోజులకే...బరబంకిలో మరో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈమెను కూడా అత్యాచారం చేసిన చంపినట్టు పోస్ట్‌ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. డిసెంబర్ 30న తతర్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళనూ ఇదే విధంగా హత్య చేశాడు సీరియల్ కిల్లర్. ఈ కేసుని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్‌ను తొలగించి...మరో అధికారిని నియమించారు. బరబంకి ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget