అన్వేషించండి

Shamshabad Gold Smuggling : బేరింగ్ లో గోల్డ్ స్మగ్లింగ్, కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బయటకు- ఎలా చిక్కాడంటే?

Shamshabad Gold Smuggling : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి 600 గ్రా. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.

విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి బయటికి వచ్చిన స్మగ్లర్... సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలో పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బేరింగ్ రూపంలో బంగారం అమర్చుకొని స్మగ్లింగ్ చేస్తుండగా సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారాన్ని పట్టుకున్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, నిందితుడ్ని  కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. 

కస్టమ్స్ కళ్లు గప్పి బయటకు 

 శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. 600 గ్రాముల‌ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారంతో బయటకు వచ్చిన స్మగ్లర్స్... బంగారాన్ని రిసీవర్స్ ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

15 కిలోల గోల్డ్ సీజ్ 

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఇటీవల భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు. బూట్లు, లగేజీ, బట్టల మధ్యలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. సూడాన్‌ దేశం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొన్న 23 మంది మహిళ ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల గోల్డ్ ను గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.7 కోట్ల 89 లక్షలు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.  

బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తుల్లో స్మగ్లింగ్ 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవల అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా... ఓ వ్యక్తి వద్ద 823 గ్రాముల బంగారం పట్టుబడింది. ఆ గోల్డ్ విలువ రూ.47 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.  బంగారాన్ని పేస్టుగా మార్చి, ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌ చేసి, దానిని లోదుస్తుల్లో దాచి స్మగ్లింగ్ చేశాడని చెప్పారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.  

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ 

 పోలీసులకు చిక్కకుండా పుష్ప సినిమాలో పుష్పరాజ్ వేసే ప్లాన్ తరహాలోనే హైదారబాద్ లో పలువురు అక్రమార్కులు గంజాయి తరలింపుకు ఓ ప్లాన్ వేశారు. కానీ సినిమాలో అది సక్సెస్ అయినా.. నిజజీవితంలో మాత్రం బెడిసి కొట్టింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు నలుగు నిందితులను అరెస్చ్ చేశారు. వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీ నగర్ లో విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు తెలిపారు. 

అసలేం జరిగిందంటే..?

హన్మకొండకు చెందిన బానోత్ వీరన్న, హైదరాబాద్ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్ కు చెందిన పంజా సూరయ్య ముథాగా ఏర్పడి ఏపీలోని అన్నవరం నుంచి రాజమండ్రి, తొర్రూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఓ అదిరిపోయే ప్లాన్ వేశారు. డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించారు. అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు. దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టుతో బిగిస్తున్నారు. ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనం అవుతున్నారు. ఇలా ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారు. వాహనంలో గంజాయి తరలుతోందని చౌటుప్పల్ పోలీసులకు ఉప్పందింది. డీసీఎంకు ముందు ఓ హ్యుందాయ్ క్రెటా కారును పైలెట్ లో పంపిస్తూ.. జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందింది. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్ లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలెట్ గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్ని చూడగా.. శబ్దంలో తేడా వచ్చింది. ఇనుప షీట్లపై బోల్టులు తొలగించడంతో 400 కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితో పాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి

వీడియోలు

సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Embed widget