![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Death Threat: ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, అలెర్ట్ అయిన పోలీసులు
PM Death Threat: ప్రధాని మోదీని చంపేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.
![PM Death Threat: ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, అలెర్ట్ అయిన పోలీసులు Prime Minister Union Home Minister Death Threat Call Received Delhi Police PM Death Threat: ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, అలెర్ట్ అయిన పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/e6908d7eeb5e4841105c716382156d8a1687331347685517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Death Threat:
బెదిరింపు కాల్స్..
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రధానితో పాటు ఓ కేంద్రమంత్రిని, బిహార్ ముఖ్యమంత్రిని కూడా చంపేస్తామని బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వరుస పెట్టి రెండు కాల్స్ రావడం వల్ల అంతా స్పెషల్గా ఓ టీమ్ని ఏర్పాటు చేసి విచారించారు. ముందు ఫోన్ చేసి బిహార ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను చంపేస్తామని బెదిరించిన ఆ వ్యక్తి...ఆ తరవాత మరోసారి కాల్ చేశాడు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రినీ హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఆ యువకుడిని గుర్తించారు. ఆ యువకుడి పేరు సంజయ్ వర్మ అని తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం...ఆ యువకుడి కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారించారు. రాత్రి నుంచి తాగుతూనే ఉన్నాడని వాళ్లు వెల్లడించారు. ప్రస్తుతానికి సంజయ్ వర్మ పరారీలో ఉన్నాడు. ఢిల్లీలోని మదీపూర్లో ఉంటున్న సంజయ్ వర్మ..మద్యం మత్తులో ఇలా బెదిరించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అరెస్ట్ చేసేందుకు అన్ని చోట్లా వెతుకుతున్నారు.
Delhi Police's outer district police received two PCR calls today from a man who threatened to kill the Prime Minister, Union Home Minister and Bihar CM; a team deployed to locate the caller, say Delhi Police.
— ANI (@ANI) June 21, 2023
ప్రధాని మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపు లేఖ రాసిన నిందితులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో రెండ్రోజుల పర్యటనకు ఇటీవలే ప్రధాని వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బీజేపీ చీఫ్ సురేంద్రన్కి లెటర్ వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ సిటీ పోలీస్ కమిషనర్ కే సేతు రామన్ ఇదే విషయాన్ని వెల్లడించారు.
"ప్రధాని మోదీని హత్య చేస్తామంటూ లెటర్ పంపిన వ్యక్తిని అరెస్ట్ చేశాం. కేవలం వ్యక్తిగత శత్రుత్వంతోనే ఈ పని చేశాడు. ఫారెన్సిక్స్ ద్వారా నిందితుడిని గుర్తించాం"
- కే సేతు రామన్,కేరళ సిటీ పోలీస్ కమిషనర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)