అన్వేషించండి

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

మతితప్పి గతి తప్పిన మావోయిస్టులను తరిమికొడదాం. ఆదివాసుల అభివృద్ధికి అడుగు వేద్దాం... స్టాప్ నక్సల్స్ సేవ్ ఆదివాసి అంటూ అతికించిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

- ములుగు ఏజన్సీలో హై అలెర్ట్, స్టాప్ నక్సలిజం - సేవ్ ఆదివాసి నినాదాలు
- వెంకటాపురం మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు
- కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతంతో రాద్ధాంతమా!
- మతితప్పి గతి తప్పిన మావోయిస్టులను తరిమికొడదాం!
- ప్రజలు నమ్మరు మీ బూటకపు ప్రచారం, ఇవి కావు నేటి యువతకి గమ్యం
- అంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

వరంగల్ : డిసెంబర్ 2వ తేదీ నుంచి 8 వరకు జరిగే పీఎల్‌జీఏ వారోత్సవాల సమయంలో ములుగు ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. వెంకటాపురం మండలంలోని పలు గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కనిపించాయి. ‘‘ప్రజల మద్దతు లేకుండా ప్రజలపైనే ప్రజాయుద్ధమా.. కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతంతో రాద్ధాంతమా... మతితప్పి గతి తప్పిన మావోయిస్టులను తరిమికొడదాం. ఆదివాసుల అభివృద్ధికి అడుగు వేద్దాం... స్టాప్ నక్సల్స్ సేవ్ ఆదివాసి’’ అంటూ అతికించిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దీంతో మావోయిస్టులు చేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను పోస్టర్లలో వెల్లడించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పీఎన్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఇప్పటికే మావోయిస్టుల పోస్టర్లు ఏజెన్సీ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి.

ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్
తెలంగాణలో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జరుగు పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్న మిలీషియా సభ్యులు ఆరుగురుని అరెస్టు చేశారు ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు. వారి వద్ద కరపత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ జరిపిన పోలీసులు ఆ ఆరుగురిని కోర్టుకు తరలించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏఎస్పీ కార్యాలయంలో మిలీషియా సభ్యుల అరెస్టుకు సంబంధించిన వివరాలు ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. వెంకటాపురం పోలీసులు, సీఆర్పిఎఫ్ సిబ్బంది ముత్తారం సీతాపురం క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆరుగురు అనుమానాస్పదంగా తరసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ ఇంచార్జ్ సుధాకర్ వద్ద 2018 నుండి పనిచేస్తున్నట్లు తెలిపారు.

వీళ్లు మావోయిస్టుల కొరియర్ లు- పోలీసులు
డిసెంబర్  తొలి వారంలో పి ఎల్ జి ఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని అగ్ర నాయకుల ఆదేశాల మేరకు వారోత్సవాల కరపత్రాలను ఆయా గ్రామాలలో రోడ్లపై వేయాలని సూచించగా.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై గతంలో పలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పై కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడిన ఆరుగురు మిలీషియా సభ్యుల వద్ద కరపత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

మళ్లీ మావోయిస్టుల కదలికలు.. 
Maoists in Telangana: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులు ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలతో కలకలం సృష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న వెంకటాపురంలో కాల్పుల సంఘటన మరువక ముందే చర్ల మండలంలో ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఉప సర్పంచ్‌ను మట్టుబెట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుండటం, మావోయిస్టు సానుభూతి పరులను గుర్తించి వారిని తిరిగి జన జీవన స్రవంతిలో కలిసేలా చేస్తుండటంతో ఇప్పటి వరకు మావోలు కదలికలు తగ్గుముఖం పట్టాయని అంతా బావించారు.

తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంతోపాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుగా ఉన్న చర్ల, వెంకటాపురం మండలాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకునే పనిలో భాగంగా అడవిలో ఉన్న గ్రామాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన చర్ల మండలంలోనే... ఇన్‌ ఫార్మర్‌ అన్న నెపంతో ఓ ఉప సర్పంచ్‌ను హత్య చేయడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget