అన్వేషించండి

Chigurupati Jayaram Case : ఎన్నారై చిగురుపాటి జయరామ్ కేసులో సంచలన తీర్పు - రాకేష్ రెడ్డి ఒక్కరే దోషి !

ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని మాత్రమే దోషిగా నిర్ధారించింది.


Chigurupati Jayaram Case :  ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నాలుగేళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని మాత్రమ దోషిగా కోర్టు తేల్చింది. మిగిలిన పదకొండు మంది నిందితుల్ని నిర్దోషులుగా తేల్చారు. వీరిలో సూర్య ప్రసాద్ అనే సినిమా నటుడుతో పాటు ఏసీపీ మల్లారెడ్డి, మరో ఇద్దరు సీఐలు ఉన్నారు. ఒక్క రాకేష్ రెడ్డి మాత్రమే చిగురుపాటి జయరామ్ ను హత్య చేసినట్లుగా కోర్టు భావించింది. రాకేష్ రెడ్డికి శిక్షను ఈ నెల 9వ తేదీన కోర్టు ఖరారు చేయనుంది. హనీ ట్రాప్‌ చేసి జయరామ్ ను ట్రాప్ చేసిన రాకేష్ రెడ్డి తర్వాత హత్య చేసినట్లుగా కోర్టుకు పోలీసులు ఆధారాలను సమర్పించారు. 

2019 జనవరి 31న చిగురుపాటి జయరామ్ హత్య !  

చిగురుపాటి జయరాం ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ గా ఉండేవారు. అప్పటికే ఎక్స్ ప్రెస్ టీవీ మూతపడింది. 2019 జనవరి 31న కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. . జాతీయ రహదారిపై కీసర సమీపంలో కారులో మృతదేహన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు హైదరాబాదుకు చెందిన చిగురుపాటి జయరామ్‌గా గుర్తించారు. జయరామ్ మృతదేహంపై రక్తపు గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి కారులో పడేసి వెళ్లి ఉంటారనే అనుమానంతో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. రాకేష్ రెడ్డి విషయం వెలుగులోకి వచ్చింది. 

సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య 

చిగురుపాటి జయరామ్‌కు డబ్బులు అప్పుగా ఇచ్చిన రాకేష్ రెడ్డి వాటిని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతూండటంతో హనీట్రాప్ ద్వారా ఇంటికి రప్పించి హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. మొత్తంగా పోలీసులు  388 పేజీల చార్జ్ షీట్ దాఖలు  చేశారు. రాకేష్ రెడ్డికి పోలీసులు కూడా సహకరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లోనే ఏసీపీ, సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. రాకేష్ రెడ్డి  4 సంవత్సరాలుగా జైల్ లో ఉంటున్నారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ కేసులో హనీ ట్రాప్ ద్వారా ప్రయత్నించింది..నటుడు సూర్య ప్రసాద్ అని పోలీసులు ప్రకటించారు. అయితే అతనిని కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆధారాలను పోలీసులు చూపించలేకపోయినట్లుగా తెలుస్తోంది.  
 
అంచెలంచెలుగా ఎదిగిన చిగురుపాటి జయరాం !

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జయరామ్ సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ ప్రారంభించి నష్టాలు రావడంతో మూసేశారు. కోస్టల్ బ్యాంక్ అధినేతగా, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీగా ఆయన సుపరిచుతులు. ఔషధాలు, అద్దాల తయారీ పరిశ్రమల్లోనూ వాటాలున్నాయి. భార్యాపిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండేవారు. ఇండియాలో వ్యాపారల కోసం తరచూ వచ్చే వారు. అయితే ఇక్కడ వ్యాపారాల్లో వచ్చిన సమస్యలు ఇతర సమస్యల కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చివరికి హత్యకు గురయ్యారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Female cop kills father: పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Allahabad High Court: వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget