అన్వేషించండి

Mahabubnagar Crime News: ఆశా వర్కర్‌నంటూ పాపకి సూదిమందు ఇచ్చి మహిళ పరార్ - చిన్నారికి అస్వస్థత!

Mahabubnagar Crime News: బడిలో ఒంటరిగా ఆడుకుంటున్న ఓ చిన్నారి వద్దకు వచ్చిన ఓ మహిళ పాప దగ్గర నుంచి బ్యాగు లాక్కోబోయింది. బాలిక ఇవ్వకపోవడంతో ఆమెను కొట్టి, సూదిమందు ఇచ్చి పరారైంది. 

Mahabubnagar Crime News: బడిలో ఒంటరిగా ఆడుకుంటున్న పాప వద్దకు వచ్చిన ఓ మహిళ బాలిక దగ్గర నుంచి బ్యాగు లాక్కునే ప్రయత్నం చేసింది. పాప గట్టిగా ఏడుస్తూ ఎంతకూ ఇవ్వకపోవడంతో.. చెంపపై గట్టిగా కొట్టింది. ఆపై బాలిక చేతికి ఓ సూదిమందు ఇచ్చి అక్కడి నుంచి పరారైంది. ఆ తర్వాత ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత రోజు నుంచి బాలిక తీవ్ర అస్వస్థతతకు గురైంది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పుట్టోనిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్, అలివేలు భార్యాభర్తలు. వీరికి అనన్య అనే కుమార్తె ఉంది. అయితే అనన్య పుట్టోనిపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈనెల 9వ తేదీన సాయంత్రం అనన్య బడిలో ఒంటరిగా ఆడుకుంటోంది. అయితే ఆశా వర్కర్ వేషధారణలో ఉన్న ఓ గుర్తు తెలియని మహిళ.. పాప వద్ద నుంచి బ్యాగు లాక్కునే ప్రయత్నం చేసింది. అనన్య మాత్రం బ్యాగు ఇవ్వకుండా విపరీతంగా ఏడవడం మొదలు పెట్టింది. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ అనన్య చెంపపై గట్టిగా కొట్టింది. ఆ తర్వాత అనన్య చెంపపై కొట్టి కుడిచేతికి సూదిమందు ఇచ్చి వెళ్లిపోయింది. 

ఏడుస్తూ ఇంటికెళ్లిన అనన్య - విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు

అనన్య ఏడుస్తూనే.. ఇంటికి వెళ్లింది. బాలిక అలా రావడంతో.. తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు. అనన్య ఏడుస్తూనే జరిగిన విషయం వివరించింది. దీంతో లక్ష్మణ్ నాయక్, అలివేలు వెంటనే గ్రామంలోని ఆశా వర్కర్ల వద్దకు వెళ్లారు. సూదిమందు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించగా అదేం లేదని, తమకు జరిగిన విషయం కూడా తెలియని చెప్పారు. అయితే మరుసటి రోజు అనన్య తీవ్ర అస్వస్థతకు గురైంది. భయపడిపోయిన తల్లిదండ్రులు బాలికను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బ్లడ్ ఇన్ ఫెక్షన్ అయిందని, చికిత్స అందించారు. అనంతరం అనన్యను ఇంటికి తీసుకొచ్చారు. 

అనారోగ్యం బాగోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు..!

అయితే అప్పటి వరకు కాస్త ఆరోగ్యంగానే ఉన్న అనన్య సోమవారం మళ్లీ అస్వస్థతకు గురైంది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు మహబూబ్ నగర్ లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స అందించారు. అయితే ఎవరో తమ కూతురుకు సూదిమందు ఇవ్వడం వల్లే పాప అనారోగ్యానికి గురువుతుందంటూ పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా చెప్పి ఫర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై పురుషోత్తం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అసలు అనన్య బ్యాగులో ఏముంది, ఓ మహిళ వచ్చి ఆమె బ్యాగును ఎందుకు లాక్కునే ప్రయత్నం చేశారు, ఎందుకు, ఎలాంటి సూది మందు ఇచ్చి వెళ్లిపోయిందనే విషయంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆశా వర్కర్ రూపంలో అసలు బడిలోకి ఎవరు వచ్చారో కచ్చితంగా కనుక్కోవాలని పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Embed widget