అన్వేషించండి

Karimnagar News : సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్యే చెప్పేవరకు విడిచిపెట్టమని తీవ్రంగా కొట్టిన పోలీసులు!

Karimnagar News : ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టాడని ఓ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్టు పెట్టలేదని బాధితుడు వాపోతున్నాడు.

Karimnagar News : సోషల్ మీడియోలో ఓ వ్యక్తి పెట్టిన పోస్టు వివాదాస్పందం అయింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో వివాదం మరింత పెరిగింది. పోలీసులు లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ బాధితుడి ఆరోపణలు చేస్తున్నారు. నడవలేని పరిస్థితిలో కాళ్లకు గాయాలయ్యాయని మీడియా ముందు వాపోయారు. 

అసలేం జరిగింది? 

కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే, టీఆరెస్ నాయకులను ఉద్దేశించి టీఆర్ఎస్ కార్యకర్త తొంటి పవన్ ఆ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో  ఒక  పోస్ట్ చేశారు. ఓ కుల సంఘాల భోజనాలకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వాడిన పదజాలం అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్ట్ పెట్టడంటూ పవన్ పై పార్టీ మండల అధ్యక్షుడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అతనిపై చట్టపరమైన చర్యలకు తీసుకోకుండా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే చెబితే వదిలేస్తామంటూ చెప్పి పవన్ ను తీవ్రంగా కొట్టారు. పవన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని విపరీతంగా కొట్టారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

ఎమ్మెల్యేని ఉద్దేశించి కాదు 

" పోస్టు పెట్టింది నేనే. మా వాళ్లను ఉద్దేశించి పెట్టాను. నేను 20 సార్లు పైగా ఎమ్మెల్యే దగ్గరు వెళ్లాను. పండుగకు రావాలని ఇన్విటేషన్ కూడా ఇచ్చాం, వస్తానన్నారు. బుధవారం రోజు వస్తానంటే ఆదివారం రోజే ఫ్లెక్సీలు కట్టాం. బుధవారానికి అన్ని ఫ్లెక్సీలు చింపేశారు. మళ్లీ బుధవారం కొత్త ఫ్లెక్సీలు తెచ్చికట్టాం. అయినా సార్ రాలేదు. మళ్లీ ఇంకో పండగ జరుగుతోంది. ఎమ్మెల్యే వస్తారని ఫ్లెక్సీ కట్టాం. మళ్లీ చింపేశారు. ఇలా చింపేశారని మండల ప్రెసిడెంట్ కు చెప్పాను. ఆ తర్వాత ఎమ్మెల్యే వచ్చారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారితో కలిసి ఆయన ఉన్నారు. వాళ్లను ఉద్దేశించి పోస్టు పెట్టాను. సార్ ను ఉద్దేశించి కాదు. పోలీసులు 20 నిమిషాలు ఆగకుండా కొట్టారు. "
--తొంటి పవన్ , బాధితుడు

అనుచిత వ్యాఖ్యలు నేరం 

" టీఆర్ఎస్ నేతలు ఓ పండుగ సందర్భంగా భోజనాలు చేస్తున్నప్పుడు ఓ ఫొటో తీసుకున్నారు. ఆ ఫొటోపై తోంటి పవన్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంగళంపల్లి నివాసి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయి. అయితే అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేరం. అందుకే పిలిచి విచారించాం "
-.- చొప్పదండి ఎస్ఐ రాజేష్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget