అన్వేషించండి

Hyderabad Gun Fire: రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తుపాకీ కాల్పులు, హైదరాబాద్ శివారులో కలకలం

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలోని కర్ణంగుడాలో కాల్పుల ఘటన జరిగింది. కర్ణంగుడా గ్రామ సమీపంలో ఇద్దరు వ్యాపారుల రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు.

హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పుల ఘటన జరిగింది. కర్ణంగుడా గ్రామ సమీపంలో ఇద్దరు వ్యాపారుల రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు (Gun Fire in Hyderabad) జరిపారు. ఈ కాల్పులతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి (Gun Fire on Realtor) మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయాలపాలు అయ్యారు. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనంపై కూడా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. అయితే, తనపై తుపాకీతో కాల్చిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని రియల్టర్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

రఘవేందర్ అనే వ్యక్తి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులకు కారణం వ్యాపార లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. సెటిల్‌మెంట్‌కు పిలిచి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు.

ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ వివరాలను వెల్లడించారు. తొలుత కారులో ముగ్గురు వ్యక్తులు బయలుదేరారని, ఆ తర్వాత మూడో వ్యక్తి.. రఘు, శ్రీనివాస్‌లపై కాల్పులు జరిపారని తెలిపారు. ఆ మూడో వ్యక్తి వారిద్దరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తే అని వివరించారు.

నేడు ఉదయం (మార్చి 1) కర్ణంగూడకు వెళ్లే మార్గంలో ఓ వాహనం రోడ్డు నుంచి దిగిపోయి ఉండడాన్ని స్థానికులు గమనించారు. అందులో ఓ వ్యక్తి పడిపోయి ఉండడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కారులోని వారిని బీఎన్ రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చనిపోగా అతని స్వగ్రామం అల్మాస్ గూడ అని గుర్తించారు. మరో బాధితుడు రఘును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. 

అతనిపైనే అనుమానం
చనిపోయిన, గాయపడిన వ్యక్తులు తెలిపిన వివరాల మేరకు.. పటేల్ గూడ ప్రాంతంలో 22 ఎకరాల్లో శ్రీనివాస్ రెడ్డి, రఘు, మట్టారెడ్డి ఓ వెంచర్ వేశారు. దీని విషయంలో ఈ ముగ్గురి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున 5 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, రఘు ఇంటి నుంచి వెళ్లినట్లుగా రఘు భార్య తెలిపారు. వెంచర్ గురించి మాట్లాడదామని మట్టారెడ్డి రమ్మంటేనే వెళ్లారని చెప్పారు. అతనే వీరు ఇద్దరిని తుపాకీతో కాల్చి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget