Haridwar Stampede: హరిద్వార్లోని మన్సా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
Mansa Devi Temple Stampede | హరిద్వార్లోని ఓ ఆలయంలో తొక్కసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Stampede at Mansa Devi Temple | హరిద్వార్: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్లోని మన్సా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాటతో విషాదం నెలకొంది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలతో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
హరిద్వార్లోని కొండ ప్రాంతంలో ప్రసిద్ధ మన్సా దేవి ఆలయం ఉంది. కేబుల్ కార్ల ద్వారా లేదా మెట్ల ద్వారా మాత్రమే ఆ ఆలయానికి చేరుకోవచ్చు. ఆదివారం నాడు శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. చాలా మంది కాన్వారీలు ఈ ఆలయాన్ని సందర్శించారు. తొక్కిసలాట బాధితులలో వారు సైతం ఉన్నారు.
#WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3
— ANI (@ANI) July 27, 2025
తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం ధామీ..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితొక్కిసలాటపై స్పందించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మన్సా దేవి ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. తాను స్థానిక అధికారులతో నిరంతరం టచ్లో ఉన్నానని, పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు.
हरिद्वार स्थित मनसा देवी मंदिर मार्ग में भगदड़ मचने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। @uksdrf, स्थानीय पुलिस तथा अन्य बचाव दल मौके पर पहुंचकर राहत एवं बचाव कार्यों में जुटे हुए हैं।
— Pushkar Singh Dhami (@pushkardhami) July 27, 2025
इस संबंध में निरंतर स्थानीय प्रशासन के संपर्क में हूं और स्थिति पर लगातार निगरानी रखी जा रही…






















