అన్వేషించండి

Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు

Andhra News: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాయి. విశాఖలో సైబర్ నిందితులను సీబీఐ అరెస్ట్ చేయగా.. తెలంగాణలో ఒకే ఖాతాలో రూ.124 కోట్లు బదిలీ కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Cyber Criminals Arrested By CBI In Visakha: విశాఖలో (Visakha) ఐదుగురు సైబర్ నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో సైబర్ నేరాల (Cyber Crime) కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. నగరంలో నివాసం ఉంటున్న అక్షయపత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షుశర్మ, పార్త్‌బాలి, పి.నవీన్ చంద్ర పటేల్ స్థానిక బిర్లా జంక్షన్ వద్ద ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ఆన్ లైన్‌లో మోసాలకు పాల్పడుతూ.. పలువురి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీబీఐ వారి కస్టడీలోకి తీసుకుంది. అటు, నగరంలోని పలు కాల్ సెంటర్లనూ తనిఖీ చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒకే ఖాతాలో రూ.124 కోట్లు

మరోవైపు, తెలంగాణలో ఒకే ఖాతాలో రూ.124 కోట్లు బదిలీ కావడం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన రూ.కోట్ల సొమ్మును హైదరాబాద్‌లోని పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకున్న కేసుకు సంబంధించి దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. నగరంలో శంశీర్‌గంజ్ ఎస్బీఐ శాఖలోని 6 కరెంట్ ఖాతాల్లోకి సైబర్ నేరాల సొమ్ము బదిలీ కావడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరింటిలోని ఒకే బ్యాంకు ఖాతాలోకి ఏకంగా రూ.124.25 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు. 'ప్రొవెన్ ఏహెచ్ఎం ఫ్యుజన్' సంస్థ పేరిట ఉన్న ఈ ఖాతాల్లోకి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సొమ్ము జమ అయింది. ఇది మహ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ పేరిట ఉన్నట్లు తేలింది. ఇతడి పేరిటే ఉన్న మరో ఖాతాలోకి రూ.34.19 లక్షలు వచ్చినట్లు వెల్లడి కాగా అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలోనే అతను కమీషన్ కోసం బ్యాంక్ ఖాతాను సమకూర్చాడని (మ్యూల్) తేలింది. దుబాయ్‌లో ఉన్న సూత్రధారి సూచన మేరకే తాను బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు నిందితుడు వెల్లడించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన సొమ్మును హవాలా మార్గంతో పాటు ఫారిన్ ఎక్స్ఛేంజీల ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. 

అటు, మిగిలిన 5 ఖాతాలూ మ్యూల్స్‌వే అని తేలింది. ఈ క్రమంలో అసలు సూత్రధారి దొరికితేనే కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఖాతాలోకి చేరిన రూ.124.25 కోట్ల నగదు 234 నేరాలకు సంబంధించిందిగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సాధారణంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కు వచ్చే ఫిర్యాదుల్ని టీజీసీఎస్‌బీ పోలీసులు విశ్లేషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శంశీర్ గంజ్ ఎస్బీఐ ఖాతాలో భారీగా సైబర్ నేరాల సొమ్ము బదిలీ కావడంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 2 నెలల్లోనే 6 కరెంట్ ఖాతాల్లోకి సుమారు రూ.150 కోట్ల వరకూ లావాదేవీలు జరగడంతో ముమ్మర విచారణ చేయగా అసలు విషయం వెలుగుచూసింది.

Also Read: Telangana BJP : నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget