అన్వేషించండి

Hyderabad: బిర్యానీ బాలేదన్నందుకు కస్టమర్లపై కర్రలు, కుర్చీలతో దాడి! రాజా సింగ్ ఫైర్

Abids Grand Hotel: బిర్యానీ బాలేదన్నందుకు, అందులో ముక్కలు తక్కువగా వచ్చాయన్నందుకు అబిడ్స్ గ్రాండ్ హోటల్ లో కస్టమర్లపై వెయిటర్లు దాడి చేశారు.

Hotel Staff attacked customers in Hyderabad: హైదరాబాద్ : బిర్యానీ బాలేదన్నందుకు, అందులో ముక్కలు తక్కువగా వచ్చాయన్నందుకు అబిడ్స్ గ్రాండ్ హోటల్ (Abids Grand Hotel) లో కస్టమర్లపై వెయిటర్లు దాడి చేశారు. కర్రలు, కుర్చీలతో వెయిటర్లు, హోటల్ సిబ్బంది దాడి చేయగా.. 12 మంది యువతీ యువకులకు గాయాలయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా బిర్యానీ తినేందుకు వెళితే వారిపై హోటల్ సిబ్బంది దాడి చేయడం నగరంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. దూల్ పేటకు చెందిన వారిపై దాడి చేశారని.. గ్రాండ్ హోటల్ సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని రాజా సింగ్ అబిడ్స్ పోలీసులను డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే హాటల్ కు నిప్పు పెడతామని సైతం రాజా సింగ్ హెచ్చరించినట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే.. 
దూల్ పేటకు చెందిన కొందరు యువతీ యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా బయట డిన్నర్ చేద్దామనుకున్నారు. అబిడ్స్ GPO వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ కు యువతీ యువకులు వెళ్లారు. అక్కడ మటన్ బిర్యానీ, కొందరికి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీలో ముక్కలు తక్కువ రావడంతో కస్టమర్లు హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అందులోనూ బిర్యానీ సరిగా లేదని, ఎందుకు ఇలా సర్వ్ చేస్తున్నారని కాస్త గట్టిగానే అడినట్లు తెలుస్తోంది. బిల్లు మాత్రం పూర్తిగా తీసుకుని కస్టమర్లను మోసం చేస్తున్నారంటూ దూల్ పేటకు చెందిన యువతీ యువకులు గ్రాండ్ హాటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కర్రలు, కుర్చీలతో కస్టమర్లపై దాడి.. 
బిర్యానీ అంత బాగాలేదని, మటన్ ముక్కలు తక్కువగా వచ్చాయని, బిల్లు మొత్తం కట్టేది లేదని చెప్పడంతో హోటల్ వెయిటర్లు వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో కస్టమర్లు, హోటల్ సిబ్బంది పరస్పరం దాడులు చేసుకున్నారు. హోటల్ సిబ్బంది అయితే కర్రలు తీసుకొచ్చి మరీ కస్టమర్లను విచక్షణారహితంగా చితకబాదారు. కుర్చీలతో సైతం కస్టమర్లపై దాడి చేయగా పలువురు కస్టమర్లు గాయపడ్డారు. తీవ్రగాయాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తమ ఏరియాకు చెందిన వారిపై హోటల్ సిబ్బంది అకారణంగా దాడి చేసి గాయపరిచిందని ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బాధ్యులైన హోటల్ సిబ్బందిపై, యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలని అబిడ్స్ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే హాటల్ పై దాడి చేసి నిప్పు పెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కస్టమర్లపై దాడికి పాల్పడిన అబిడ్స్ గ్రాండ్ హోటల్ కు చెందిన కొందరు వెయిటర్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. కస్టమర్లపై దాడి ఘటనకుగానూ పోలీసులు గ్రాండ్ హోటల్ పై 324, 504, 509 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మరోవైపు హోటల్ యాజమాన్యం సైతం కస్టమర్లపై ఫిర్యాదు చేసింది. తమ సిబ్బందితో దురుసుగా మాట్లాడి, వారిపై దాడి చేయడం వల్లే గొడవ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget