అన్వేషించండి

Crime News: తూ.గో జిల్లాలో దారుణం - భార్యపై అనుమానంతో కత్తెరతో పొడిచి చంపేశాడు

Andhrapradesh News: ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే అనుమానంతో కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Husband Killed His Wife In Nidadavole: తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కిరాతకంగా కత్తెరతో పొడిచి ఆమెను హతమార్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా నిడదవోలు (Nidadavole) మండలం శెట్టిపేట (Settipeta) గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ మేస్త్రీగా పని చేస్తూ భార్య నవ్యతో జీవనం సాగిస్తున్నాడు. పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 ఏళ్ల క్రితం చిరంజీవికి వివాహమైంది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. అయితే, కొంతకాలంగా భార్యపై చిరంజీవి అనుమానం పెంచుకున్నాడు. వేరే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఆమెతో తరచూ గొడవ పడేవాడు.

కత్తెరతో పొడిచి..

ఇదే విషయమై దంపతుల మధ్య శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఆమెను హతమార్చాడు. తమ కుమార్తెను చిరంజీవి కత్తెరతో గొంతులో పొడిచి హతమార్చాడని నవ్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

తెలంగాణలోనూ దారుణం

అటు, తెలంగాణలోనూ దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, 10 నెలల చిన్నారిని దారుణంగా చంపేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నపై అనుమానంతో ఆమెతో పాటు తన 10 నెలల పాపను గొంతు నులిమి చంపేశాడు. అంతకు ముందు నిందితుడు తాను తన భార్య, పిల్లల్ని చంపినట్లుగా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే రైలు పట్టాలపై శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన గణేష్ నాలుగు నెలల క్రితం బోయిన్పల్లికు వచ్చి నివాసం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వీరి సంతానం మరో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

Also Read: Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం - ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి లైంగిక దాడి, పోలీసుల అదుపులో నిందితుడు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
Embed widget