అన్వేషించండి

Crime News: తూ.గో జిల్లాలో దారుణం - భార్యపై అనుమానంతో కత్తెరతో పొడిచి చంపేశాడు

Andhrapradesh News: ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే అనుమానంతో కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Husband Killed His Wife In Nidadavole: తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కిరాతకంగా కత్తెరతో పొడిచి ఆమెను హతమార్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా నిడదవోలు (Nidadavole) మండలం శెట్టిపేట (Settipeta) గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ మేస్త్రీగా పని చేస్తూ భార్య నవ్యతో జీవనం సాగిస్తున్నాడు. పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 ఏళ్ల క్రితం చిరంజీవికి వివాహమైంది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. అయితే, కొంతకాలంగా భార్యపై చిరంజీవి అనుమానం పెంచుకున్నాడు. వేరే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఆమెతో తరచూ గొడవ పడేవాడు.

కత్తెరతో పొడిచి..

ఇదే విషయమై దంపతుల మధ్య శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఆమెను హతమార్చాడు. తమ కుమార్తెను చిరంజీవి కత్తెరతో గొంతులో పొడిచి హతమార్చాడని నవ్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

తెలంగాణలోనూ దారుణం

అటు, తెలంగాణలోనూ దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, 10 నెలల చిన్నారిని దారుణంగా చంపేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నపై అనుమానంతో ఆమెతో పాటు తన 10 నెలల పాపను గొంతు నులిమి చంపేశాడు. అంతకు ముందు నిందితుడు తాను తన భార్య, పిల్లల్ని చంపినట్లుగా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే రైలు పట్టాలపై శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన గణేష్ నాలుగు నెలల క్రితం బోయిన్పల్లికు వచ్చి నివాసం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వీరి సంతానం మరో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

Also Read: Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం - ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి లైంగిక దాడి, పోలీసుల అదుపులో నిందితుడు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget