అన్వేషించండి

Hathras Stampede: యూపీలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర విషాదం - తొక్కిసలాటలో 116 మంది మృతి

Hathras Stampede News: ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం జరిగింది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Hathras stampede death: ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాథ్రస్ (Hathras) జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఇప్పటివరకూ అధికారిక లెక్కల ప్రకారం 116 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఇటా ఆస్పత్రికి తరలించారు. రతీభాన్‌పూర్‌లో శివారాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో ఒక్కసారి తోపులాట జరిగి దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఘటనపై దర్యాప్తునకు ఆదేశం

ఈ దుర్ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోందని కలెక్టర్ ఆశీష్ కుమార్ తెలిపారు. 'ఇప్పటివరకూ 87 మంది వరకూ మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఈ విషాదం చోటు చేసుకుంది' అని పేర్కొన్నారు.

ఇప్పటివరకూ పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారని.. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నట్లు ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ త్రిపాఠి వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని అన్నారు.

రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హాథ్రాస్‌లో అధిక సంఖ్యలో భక్తులు మరణించడం తీవ్ర బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

అమిత్ షా దిగ్భ్రాంతి

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. 

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'యూపీలోని హాథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ఇందులో తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బాధితులకు ప్రభుత్వం యంత్రాంగం అన్ని విధాలా సహాయం చేస్తోంది.' అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget