అన్వేషించండి

UPI Payments: రోజుకు 36 కోట్లకు పైగా యూపీఐ పేమెంట్స్‌, ఫోన్లు మారుతున్న వేల కోట్లు

2022 ఫిబ్రవరి నెలలో సగటు లావాదేవీల మొత్తం విలువ రూ. 5.36 లక్షల కోట్లుగా ఉంటే.. 2023 ఫిబ్రవరి నెలలో సగటు లావాదేవీల మొత్తం విలువ రూ. 6.27 లక్షల కోట్లుగా ఉంది,

UPI Payments: భారతదేశంలో పెరిగిన ఇంటర్నెట్‌ వ్యాప్తి, స్మార్ట్‌ఫోన్ల వినియోగం కారణంగా.. UPI లావాదేవీలు కూడా విపరీతంగా పెరిగాయి. UPI (Unified Payments Interface) ద్వారా చెల్లింపులు 2022 ఫిబ్రవరి నెలతో పోలిస్తే, 2023 ఫిబ్రవరి నెలలో 50 శాతం పెరిగాయి. 

రోజుకు 24 కోట్ల నుంచి 36 కోట్లకు..     
2022 ఫిబ్రవరి నెలలో రోజుకు సగటున 24 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగితే... 2023 ఫిబ్రవరి నెలలో రోజుకు సగటున 36 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ఈ గణాంకాలను విడుదల చేశారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో డిజిటల్ చెల్లింపుల అవగాహన వారోత్సవాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.

పెరిగిన లావాదేవీల విలువ                 
2022 ఫిబ్రవరి నెలలో సగటు లావాదేవీల మొత్తం విలువ రూ. 5.36 లక్షల కోట్లుగా ఉంటే.. 2023 ఫిబ్రవరి నెలలో సగటు లావాదేవీల మొత్తం విలువ రూ. 6.27 లక్షల కోట్లుగా ఉంది, ఏడాది క్రితం కాలం కంటే ఇది 17 శాతం వృద్ధి. గత మూడు నెలలుగా ‍‌(2022 డిసెంబర్‌ నుంచి), మొత్తం డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ప్రతి నెలలోనూ రూ. 1,000 కోట్ల మార్కును దాటాయని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. 2016లో ప్రారంభమైన UPI సేవలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని, మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో వీటి వాటా 75 శాతంగా ఉందని శక్తికాంత దాస్‌ చెప్పారు. 

ఇటీవల, దేశవ్యాప్తంగా చేపట్టిన పాన్-ఇండియా డిజిటల్ పేమెంట్స్‌ సర్వేలో (90,000 మంది పాల్గొన్నారు) 42 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు. 2017 జనవరిలో 45 లక్షల UPI లావాదేవీలు జరగ్గా, 2023 జనవరిలో ఈ సంఖ్య 804 కోట్లకు పెరిగిందని దాస్‌ తెలిపారు. ఇదే కాలంలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 1,700 కోట్ల నుంచి రూ. 12.98 లక్షల కోట్లకు పెరిగింది.

UPIతో లింక్‌ కోసం ప్రపంచ దేశాల ఆసక్తి           
భారతదేశ UPI పేమెంట్స్‌ వ్యవస్థ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోందని శక్తికాంత దాస్ చెప్పారు. చాలా దేశాలు UPI చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. 2023 ఫిబ్రవరి 21న, భారతదేశ UPIతో సింగపూర్‌కు చెందిన 'పేనౌ'ని (Paynow) అనుసంధానించారు. ఆ తర్వాత, గత 10 రోజుల్లో సింగపూర్‌ నుంచి మన దేశంలోకి 120 లావాదేవీల ద్వారా నగదు వచ్చిందని, మన దేశం నుంచి 22 లావాదేవీల ద్వారా నగదు సింగపూర్‌కు వెళ్లిందని గవర్నర్‌ వివరించారు. చాలా దేశాలు కూడా UPIతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపిస్తున్నాయని శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఒప్పందం చేసుకోవడానికి కనీసం 6 దేశాలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని చెప్పారు.

RBI భవిష్యత్‌ ప్రణాళిక                
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ 75 గ్రామాలను దత్తత తీసుకుంటుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఈ గ్రామాల ప్రజలను కలుపుకుని డిజిటల్ చెల్లింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. PSOలు 75 గ్రామాలను దత్తత తీసుకుని వాటిని డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ గ్రామాలుగా మారుస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget