అన్వేషించండి

Total energies Adani Deal: అదానీతో టోటల్‌ ఎనర్జీస్‌ డీల్‌ - 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి

Totalenergies Adani Deal: అదానీ గ్రూప్‌ మరో జాక్‌పాట్‌ కొట్టబోతోంది! అదానీ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో టోటల్‌ ఎనర్జీస్‌ ఎస్‌ఈ భారీ పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం.

Totalenergies Adani Deal: 

అదానీ గ్రూప్‌ మరో జాక్‌పాట్‌ కొట్టబోతోంది! అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) అభివృద్ధి చేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో టోటల్‌ ఎనర్జీస్‌ ఎస్‌ఈ (Total Energies SE) కంపెనీ భారీ పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం. అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌  సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన అదానీ గ్రూప్‌ కుదుర్చుకొంటున్న తొలి బహిరంగ ఒప్పందం ఇదే కానుంది. కాగా ఈ వ్యవహారంపై రెండు కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

స్వచ్ఛ ఇంధన పోర్టుపోలియోను విస్తరించుకోవాలని టోటల్‌ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగానే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో వాటా కొనుగోలుకు సిద్ధమైందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మీడియాకు తెలిపారు. పెట్టుబడి విలువ 700 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. లావాదేవీని ఎలా పూర్తి చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని వివరించారు.

ఈ ఒప్పందం కుదిరితే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఇంధన మార్కెట్లో టోటల్‌ ఉనికి పెరుగుతుంది. మరోవైపు అదానీ గ్రీన్‌ మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా రెండు కంపెనీల మధ్య బలం మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటికే అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటాతో టోటల్‌ రెండో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కర్బణ ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులు రాకుండా అడ్డుకొనేందుకు అన్ని దేశాలు ఏకమవుతున్న సంగతి తెలిసిందే. పైగా షేరు హోల్డర్ల నుంచీ డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకే టోటల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

అదాన్‌ గ్యాస్‌ లిమిటెడ్‌లో టోటల్‌ గ్యాస్‌ 2019లో పెట్టుబడి పెట్టింది. 600 మిలియన్‌ డాలర్లతో 27.4 శాతం వాటా కొనుగోలు చేసింది. దాంతో కంపెనీ పేరు అదానీ టోటల్‌ గ్యాస్‌గా మారింది. ఇక 2021లో అదానీ గ్రీన్‌లో కంపెనీ 20 శాతం వాటా కైవసం చేసుకుంది. అలాగే అదానీ గ్రీన్‌ సోలార్‌ ఫార్మ్స్‌లోనూ 2.5 బిలియన్ డాలర్లతో వాటా కొనుగోలు చేసింది. దీంతో 2022లో అదానీ గ్రీన్‌లో పెట్టిన పెట్టుబడి విలువ 10 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అలాగే భారత్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించాలని టోటల్‌ భావిస్తోంది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు శుక్రవారం రూ.18 పెరిగి రూ.1000 వద్ద కొనసాగుతున్నాయి. ఉదయం రూ.990 వద్ద మొదలైన షేర్లు  రూ.983 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. రూ.1012 వద్ద గరిష్ఠాన్ని అందుకున్నాయి. ఇక అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన షేర్లు ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget