అన్వేషించండి

Share Market Today: ఫెడ్‌ ఇచ్చిన ధైర్యంతో కొత్త గరిష్టాలకు స్టాక్‌ మార్కెట్లు - రికార్డ్‌ స్థాయిలో ఓపెనింగ్స్‌

Share Market Opens At Record High: ముందు నుంచీ ఊహించిన విధంగానే జరిగింది, మన స్టాక్ మార్కెట్ బలంగా ప్రారంభమైంది. యుఎస్ ఫెడ్ నిర్ణయంతో భారతీయ మార్కెట్లలో బాణసంచా పేలింది.

Stock Markets At Record Levels: అమెరికన్ సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడ్‌ (US FED) నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడంతో స్టాక్‌ మార్కెట్లు పండగ చేసుకుంటున్నాయి. యూఎస్‌ ఫెడ్‌, అమెరికాలో వడ్డీ రేట్లను 0.50% మేర కోసేసింది. ఫెడ్‌ ఇచ్చిన బూస్ట్‌తో, భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (గురువారం, 19 సెప్టెంబర్‌ 2024), ఊహించిన విధంగానే బుల్లిష్‌గా ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ఫెడ్ నిర్ణయ తక్షణ ప్రభావం భారతీయ మార్కెట్ల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయుల్లో ఓపెన్‌ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త శిఖరాన్ని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు వేగంగా పరుగులు పెడుతున్నాయి. HDFC బ్యాంక్ షేర్లు రూ. 1711 పైన ట్రేడ్‌ అవుతున్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..

గత సెషన్‌లో (బుధవారం) 82,948 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 410.95 పాయింట్లు లేదా 0.50 శాతం పెరిగి 83,359.17 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 25,377 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 109.50 పాయింట్లు లేదా 0.43 శాతం పెరిగి 25,487.05 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.

యునైటెడ్ స్పిరిట్స్ వాటా ఈ రోజు కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో, మద్యానికి సంబంధించిన షేర్లు పెరిగే అవకాశం ఉంది.

సెన్సెక్స్ షేర్ల అప్‌డేషన్‌
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 29 స్టాక్స్ పెరిగితే, ఒక్క స్టాక్ మాత్రమే తగ్గింది. సెన్సెక్స్ షేర్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మాత్రమే పడిపోతున్నాయి. 

నిఫ్టీ షేర్ల స్టేటస్‌
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 44 షేర్లు లాభపడగా, 6 మాత్రమే క్షీణతలో ఉన్నాయి. 

బ్యాంక్ నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయి 53,357.70గా ఉంది. ఈ రోజే ఇది ఆల్ టైమ్ హైని అధిగమించే అవకాశం ఉంది. మార్కెట్‌ ప్రారంభ నిమిషాల్లో బ్యాంక్‌ నిఫ్టీ 53,353.30 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని నమోదు చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లో అన్ని షేర్లు పెరుగుతున్నాయి. HDFC బ్యాంక్ 1 శాతం పైగా జంప్‌ చేసింది.

మార్కెట్ ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత.. BSE సెన్సెక్స్‌ 643.43 పాయింట్లు లేదా 0.78 శాతం జంప్‌తో 83,591.66 స్థాయి వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 183.30 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 25,560.85 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్ ప్రారంభమైన 35 నిమిషాల తర్వాత, ఉదయం 09.50 గంటలకు, BSE సెన్సెక్స్ 693.50 పాయింట్లు లేదా 0.84% పెరిగి 83,641.73 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 172.25 పాయింట్లు లేదా 0.68% లాభంతో 25,549.80 దగ్గర ట్రేడవుతోంది.

అదే సమయానికి, సెన్కెస్‌ 83,773.61 వద్ద లైఫ్‌ టైమ్‌ హైని ‍(Sensex at fresh all-time high); నిఫ్టీ 25,611.95 వద్ద జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) నమోదు చేశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget