అన్వేషించండి

Share Market Closing Today: లార్జ్‌ క్యాప్స్‌ ర్యాలీతో రికార్డ్‌ స్థాయిలో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - 26000 చేరువలో నిఫ్టీ

Sensex And Nifty At New All-time Highs: భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ విలువ ఈ రోజు రూ.4.29 లక్షల కోట్లు పెరిగింది, తొలిసారిగా రికార్డు స్థాయిలో రూ.476 లక్షల కోట్లను తాకింది.

Stock Market Closing On 23 September 2024: ఈ వారంలో మొదటి రోజు (సోమవారం, 23 సెప్టెంబర్‌ 2024) భారతీయ స్టాక్ మార్కెట్‌కు చారిత్రాత్మకంగా (Stock markets at record levels) మారింది. సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 85000 రికార్డు స్థాయికి 20 పాయింట్ల దూరంలో ఆగింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ కూడా చారిత్రక గరిష్ఠ స్థాయి 26000కి 44 పాయింట్ల దూరంలో ఉంది. ఈ రోజు బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ షేర్లలో బలమైన కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 384 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్లు జంప్‌ చేశాయి.

ఇంట్రా-డే ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్‌ తాజా జీవితకాల గరిష్ట స్థాయి 84,980.53 మని ‍(Sensex at fresh all-time high) క్రియేట్‌ చేసింది. NSE నిఫ్టీ కూడా 25,956 (Nifty at fresh all-time high) వద్ద లైఫ్‌టైమ్‌ హైని టచ్‌ చేసింది.

ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 384.30 పాయింట్లు లేదా 0.45% పెరిగి 84,928.61 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 148.10 పాయింట్లు లేదా 0.57% లాభంతో 25,939.05 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 84,651.15 వద్ద, నిఫ్టీ 25,872.55 వద్ద ఓపెన్‌ అయ్యాయి.

పెరిగిన & పడిపోయిన షేర్లు
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో... 21 షేర్లు లాభాల్లో, 9 షేర్లు నష్టాలతో ముగిశాయి. టాప్‌ గెయినర్స్‌లో.... మహీంద్రా & మహీంద్రా 3.18%, SBI 2.35%, భారతీ ఎయిర్‌టెల్ 2.26%, హెచ్‌యుఎల్ 1.54%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.49%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.42%, అదానీ పోర్ట్స్ 1.24%, టాటా స్టీల్ 1.22%, ఎన్‌టీపీసీ 1.03 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.98 శాతం పెరుగుదలతో ముగిశాయి. టాప్‌ లూజర్స్‌లో... ఐసీఐసీఐ బ్యాంక్ 1.25 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.05 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.97 శాతం, టెక్ మహీంద్రా 0.89 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.49 శాతం, ఇన్ఫోసిస్ 0.48 శాతం, టీసీఎస్ 0.41 శాతం, ఎల్‌అండ్ టీ 0.30 శాతం, పవర్ గ్రిడ్‌ 0.30 శాతం, JSW స్టీల్ 0.01 శాతం క్షీణతతో క్లోజ్‌ అయ్యాయి.

సెక్టార్ల వారీగా చూస్తే..
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ సెక్టార్లు లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లు పతనాన్ని చవిచూశాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 503 పాయింట్ల జంప్‌తో రికార్డు స్థాయిలో 60,712 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 216 పాయింట్ల లాభంతో ముగిసింది.

మార్కెట్ క్యాప్‌
స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా రికార్డు స్థాయిలో ముగియడంతో స్టాక్ మార్కెట్ విలువ సరికొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. బీఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాప్ తొలిసారిగా రికార్డు స్థాయిలో రూ.476 లక్షల కోట్ల వద్ద (market capitalization of indian stock market) ముగిసింది. క్రితం సెషన్‌లో ఇది రూ.471.71 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే, నేటి సెషన్‌లో మార్కెట్ క్యాప్‌లో రూ.4.29 లక్షల కోట్ల జంప్‌ నమోదైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget