అన్వేషించండి

Rupee-Dollar Value Since 1947: స్వాతంత్ర్యం తర్వాత రూపాయి-డాలర్‌ ప్రయాణం ఎలా సాగింది, రూ.83 స్థాయికి ఎందుకు పడింది?

అమెరికన్‌ డాలర్ కంటే విలువైన ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉన్నాయి. అయినా, ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌ను లెక్కేస్తున్నారు.

Rupee-Dollar Value Since 1947: అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా, అగ్రరాజ్యంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. అగ్రరాజ్య ప్రభుత్వంతో పాటు, ఆ దేశ కరెన్సీ అయిన డాలర్ (Dollar) కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసిస్తుంది. అమెరికన్‌ డాలర్ కంటే విలువైన ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉన్నాయి. అయినా, ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌ను లెక్కేస్తున్నారు. ప్రతి దేశం ఇతర దేశాలతో అమెరికన్‌ డాలర్లలో మాత్రమే వ్యాపారం చేస్తుంది. విదేశీ పెట్టుబడిదార్లు ఒక దేశంలో డాలర్ల రూపంలోనే పెట్టుబడులు పెడతారు. కాబట్టే, బెంచ్‌మార్క్ కరెన్సీగా డాలర్ చలామణీ అవుతోంది. ప్రపంచంలోని ఇతర కరెన్సీల విలువను కూడా ఇది నిర్ణయిస్తుంది. అదేవిధంగా మన దేశ రూపాయి విలువను కూడా డాలర్ మార్చేస్తుంది.

1947లో ఒక డాలర్ విలువ రూ.4.16
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 నుంచి, భారతీయ కరెన్సీని డాలర్‌తో కొలవడం ప్రారంభించారు. అంతకు ముందు బ్రిటిష్ పాలన కారణంగా పౌండ్‌తో రూపాయి విలువ లెక్కించే వాళ్లు. 1947లో ఒక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 4 రూపాయల 16 పైసలుగా ఉంది. 1950 నుంచి 1966 వరకు డాలర్‌తో రూపాయి విలువ రూ. 4.76 గా ఉంది. ఆ తర్వాతి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించడం, విదేశాల నుంచి తీసుకున్న అప్పులు పేరుకుపోవడం, 1962లో భారత్- చైనా యుద్ధం, 1965లో భారత్- పాకిస్థాన్ యుద్ధం, 1966లో తీవ్ర కరవు కారణంగా దేశానికి ఆర్థిక కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దీంతో, ఒక డాలర్‌తో రూపాయి మారకపు విలువ 1967లో రూ. 7.50 కి దిగి వచ్చింది. ముడి చమురు సరఫరా సంక్షోభం కారణంగా 1974లో డాలర్‌తో రూపాయి విలువ రూ. 8.10 కి తగ్గింది. ఆ తరువాత దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, భారీగా విదేశీ రుణాలు తీసుకోవడంతో భారత కరెన్సీ భారీ స్థాయిలో పతనమైంది. అక్కడి నుంచి దశాబ్ద కాలం పాటు రూపాయి పతనం కొనసాగింది. 1990లో, ఒక డాలర్‌తో రూ. 17.50 స్థాయికి రూపాయి పడిపోయింది.

1990 తర్వాత భారీ పతనం
1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. భారతదేశానికి విదేశీ అప్పుల భారం ఎక్కువైంది. భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 39 శాతం రుణాల మీద వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆర్థిక లోటు 7.8 శాతానికి చేరుకుంది. రుణాల ఎగవేతదారుగా (డిఫాల్టర్‌) మారే దశకు భారత్‌ చేరుకుంది. ఆ సమయంలో, ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో, 1991లో ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైంది. 1992లో డాలర్‌తో రూపాయి విలువ రూ. 25.92 కి పడిపోయింది. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక డాలర్‌ విలువ రూ. 45.32 గా ఉంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది తర్వాత ఒక్క డాలర్ విలువ 63 రూపాయలుగా మారింది. ఆ తర్వాత కూడా రూపాయి బలహీనత కొనసాగింది. 2021లో ఒక డాలర్ విలువ రూ. 74.57 కి సమానమైంది.

2022లో రూపాయి బలహీనత
2022లో, ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించింది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదార్లు భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా రూపాయి విలువ మరింత దిగజారింది. దీంతో పాటు, భారత దేశ విదేశీ మారకపు నిల్వలు 640 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి 530 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 10 శాతం పడిపోయింది, రూ. 83 కనిష్ట స్థాయికి చేరింది. 

ప్రస్తుతం ఒక డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 81.71 కి చేరువలో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget