అన్వేషించండి

Ambani Children Salary: తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?

ఆకాష్, ఇషా, అనంత్ అంబానీ నియామకాలపై ఆమోదం కోరుతూ, తాజాగా, తన వాటాదార్లకు పోస్టల్‌ బ్యాలెట్‌లు పంపింది.

Akash, Isha, Anant Ambani Salary: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) ఓనర్‌ అయిన ముఖేష్ అంబానీ, కంపెనీ అభివృద్ధి కోసం 24x7 కష్టపడుతుంటారు. అయినా, కంపెనీ నుంచి ఆయన ఎటువంటి జీతం తీసుకోవడం లేదు. గత మూడు సంవత్సరాలుగా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే (zero salary) ముకేష్‌ అంబానీ పని చేస్తున్నారు. ఇప్పుడు, రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్య వారసులైన అతని ముగ్గురు పిల్లలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 'జీరో శాలరీ'తో పని చేస్తున్నారు. అంబానీ కుటుంబ వారసులైన ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ కూడా, తమ తండ్రి లాగానే జీతం తీసుకోకుండా పని చేయడానికి నిర్ణయించుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌ మీటింగ్స్‌, కమిటీ మీటింగ్స్‌ హాజరైనందుకు ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్‌ మాత్రమే వాళ్లకు చెల్లిస్తారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీని కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చేర్చేందుకు చేసిన తీర్మానంలో, ఆ ముగ్గురు జీరో శాలరీ తీసుకుంటారన్న విషయాన్ని చేర్చినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) ప్రకటించింది. ఆకాష్, ఇషా, అనంత్ అంబానీ నియామకాలపై ఆమోదం కోరుతూ, తాజాగా, తన వాటాదార్లకు పోస్టల్‌ బ్యాలెట్‌లు పంపింది. 

ఈ ఏడాది ఆగస్టు 28న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ యాన్యువల్‌ జనరల్‌ మీటింగ్‌లో (RIL AGM‌), తన ముగ్గురు పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డులో చేర్చుకుంటున్నట్లు ఛైర్మన్ & CEO ముఖేష్ అంబానీ ప్రకటించారు. తాను మరో ఐదేళ్ల పాటు, అంటే 2029 ఏప్రిల్‌ 18 వరకు కంపెనీ  ఛైర్మన్ & CEOగా కొనసాగుతానని కూడా అదే సమావేశంలో ముకేష్‌ అంబానీ ప్రకటించారు. విశేషం ఏంటంటే... ఈ ఐదేళ్ల కాలానికి కూడా (2029 ఏప్రిల్‌ 18 వరకు) జీరో జీతంతోనే ముకేష్‌ అంబానీ పని చేయనున్నారు. తనకు కమీషన్‌ కూడా వద్దని ముకేశ్‌ అంబానీ చేసిన రిక్వెస్ట్‌ ప్రకారం, 2024 ఏప్రిల్‌ 19 నుంచి 2029 ఏప్రిల్‌ 18 వరకు, జీతం & కమీషన్‌ రూపంలో ఆయనకు ఒక్క రూపాయిని కూడా కంపెనీ చెల్లించదు.

ముఖేష్ అంబానీ పిల్లలకు ఎంత ఫీజ్‌, కమీషన్‌ వస్తుంది?
ముకేశ్‌ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ 2014లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌ బోర్డు డైరెక్టరుగా చేరారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌ మీటింగ్స్‌, కమిటీ మీటింగ్స్‌ హాజరైనందుకు సిట్టింగ్‌ ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్‌ను ఆమెకు చెల్లించేలా ఆ నియామకం జరిగింది. అవే షరతులు ఆకాశ్‌, అనంత్‌, ఇషాకూ వర్తించనున్నాయి. 2022-23లో, బోర్డు సమావేశాలకు హాజరైనందుకు సిట్టింగ్‌ ఫీజ్‌ కింద రూ.6 లక్షలు, కమీషన్‌ రూపంలో మరో రూ.2 కోట్లను నీతా అంబానీ పొందారు. ఆకాశ్‌, అనంత్‌, ఇషాకు కూడా దాదాపు ఇదే అమౌంట్‌ అందే అవకాశం ఉంది. ప్రస్తుతం, నీతా అంబానీ బోర్డ్‌ డైరెక్టర్‌గా లేరు. వారసత్వ ప్రణాళికలో (succession planning) భాగంగా, డైరెక్టర్‌ పదవికి నీతా అంబానీ రిజైన్‌ చేశారు. అయితే బోర్డు సమావేశాలన్నింటికీ హాజరయ్యేలా ఆమెకు శాశ్వత ఆహ్వానితురాలు (permanent invitee) హోదా ఇచ్చారు.

ముఖేష్ అంబానీ పిల్లలు ఏ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు?
రిలయన్స్ టెలికాం బిజినెస్ అయిన జియో బాధ్యతలను ఆకాష్ అంబానీ తీసుకున్నారు. రిలయన్స్ రిటైల్ వ్యాపారమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌ను ఇషా అంబానీ చూసుకుంటున్నారు. అనంత్ అంబానీకి రిలయన్స్ ఎనర్జీ & పునరుత్పాదక ఇంధన వ్యాపారం లభించింది. వారసత్వ ప్రణాళిక ప్రకారం, తన పిల్లలందరికీ వ్యాపారంలోని వివిధ విభాగాలను ముఖేష్ అంబానీ విభజించి ఇచ్చారు. వచ్చే ఐదేళ్లపాటు కంపెనీ చైర్మన్‌గా కొనసాగుతూ, తన పిల్లలకు మార్గనిర్దేశం చేస్తారు.

మరో ఆసక్తికర కథనం: రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget