అన్వేషించండి

Reliance Jio IPO: ఐపీఓకి రానున్న జియో.. రిలయన్స్ ఏజీఎంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

Reliance Industries AGM 2025 | భారత మార్కెట్లో వచ్చే ఏడాది అతిపెద్ద ఐపీఓ రాబోతుంది. పెట్టుబడిదారుల ఎదురుచూపులకు తెరదించుతూ రిలయన్స్ ఏజీఎంలో ముఖే ష్ అంబానీ కీలక ప్రకటన చేశారు.

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం నాడు తన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) నిర్వహించింది.  డిజిటల్, ఇంధన వ్యాపారాలలో వృద్ధిపై దృష్టి సారించినట్లు అంబానీ తెలిపారు. జియో ఎట్టకేలకు ప్రజల్లోకి వెళుతుందని, 2026 మొదటి అర్ధభాగంలో (తొలి 6 నెలల్లో) ఐపీఓకి లిస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. దాంతోపాటు రియలన్స్ సాధించిన కీలక మైలురాళ్లు,  ప్రణాళికలను ఆవిష్కరించారు. 

ఐపీఓ కోసం జియో సన్నాహాలు

జియో పరిమాణం, దాని బలం ప్రజల్లోకి మరింతగా వెళ్లనుంది. జియో ఐపీఓ మార్కెట్లలోకి ప్రవేశించడానికి నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది రావడానికి ప్లాన్ చేసినట్లు అంబానీ స్పష్టం చేశారు. "జియో 500 మిలియన్ కస్టమర్లను దాటింది. ఇది దేశంలోనే అతిపెద్ద డిజిటల్ సేవల ప్రొవైడర్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్దది సంస్థగా నిలిచిందని" ఆయన అన్నారు. ప్రతిపాదిత IPO భారత మార్కెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన జాబితాలలో ఒకటిగా ఉంటుంది. ఇన్వెస్టర్లు  చాలా కాలం నుంచి జియో ఐపీఓ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తెలిసిందే

‘ IPO కోసం జియో అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రకటిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. మేం అన్ని అనుమతులు తీసుకుని 2026 మొదటి అర్ధభాగం నాటికి జియోను లిస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది జియో తన ప్రపంచ భాగస్వాములలాగే అదే విలువను సృష్టిస్తుందని మీకు హామీ ఇస్తున్నాను. ఇది పెట్టుబడిదారులందరికీ చాలా మంచి అవకాశంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను" అని వార్షిక సమావేశంలో RIL CMD ముఖేష్ అంబానీ అన్నారు.

ఆఫరింగ్ కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. టెలికాం, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ సేవలలో జియో అవకాశాలను ఉపయోగించుకోవడానికి రిలయన్స్ ఆసక్తి చూపుతోంది. ఈ ఐపీఓ లిస్టింగ్ వాటాదారులకు గణనీయమైన విలువను అన్‌లాక్ చేస్తుందని, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో బెస్ట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.

రిలయన్స్ విజన్: AI, క్లీన్ ఎనర్జీ, డీప్ టెక్

జియోతో పాటు, రిలయన్స్ ఫ్యూచర్ కోసం అంబానీ ఒక బ్లూప్రింట్‌ను రూపొందించారు. రిటైల్, టెలికాం నుంచి ఇంధనం, వినోదం వరకు తమ వ్యాపారాలన్నింటిలో కృత్రిమ మేధస్సును వినియోగిస్తామని ఆయన చెప్పారు. AIని "మన కాలపు కామధేనువు"గా అభివర్ణిస్తూ, ఇది సామర్థ్యం, ఉత్పాదకత, ఆవిష్కరణలను పెద్ద ఎత్తున నడిపించే అభివృద్ధి ఇంజిన్‌గా దీనిని అంబానీ పేర్కొన్నారు. 

"భారతదేశం కోసం ప్రపంచంలోని అత్యంత అధునాతన క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్‌ నిర్మిస్తున్నాం. మేము డిజిటల్ హెల్త్, లైఫ్ సైన్సెస్, జీనోమిక్స్ రంగంలోకి విస్తరిస్తున్నాం. AIని కొత్త వృద్ధి ఇంజిన్‌గా అభివృద్ధి చేస్తాం. మా అన్ని వ్యాపారాలలో AIని వినియోగిస్తామని’ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం క్లీన్ ఎనర్జీ, డిజిటల్ పరివర్తనకు ఇది లీడర్‌గా నిలిచిందన్నారు. 

ఆర్థిక పనితీరు, కార్మిక శక్తి విస్తరణ

FY25 గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన పనితీరును హైలైట్ చేసింది, వార్షిక ఆదాయంలో $125 బిలియన్లను దాటిన మొదటి భారత కంపెనీగా నిలిచింది.  ఆదాయం రూ. 10.71 లక్షల కోట్లు ఉండగా, EBITDA రూ. 1.83 లక్షల కోట్లకు చేరింది. నికర లాభం రూ. 81,309 కోట్లుగా ఉంది. ఈ సంస్థ ఎక్స్‌చెకర్ కోసం రూ. 2.10 లక్షల కోట్లు ఇచ్చింది. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది దాని పాత్రను నొక్కి చెబుతుంది. ఉపాధి కల్పన కూడా అంబానీ ప్రసంగంలో ప్రస్తావించారు. రిలయన్స్ ఉద్యోగులు, సిబ్బంది ప్రస్తుతం 6.8 లక్షలుగా ఉన్నారు. భవిష్యత్తులో ఇది 10 లక్షలకు మించిపోతుందని భావిస్తున్నారు.

దేశీయ వృద్ధితో గ్లోబల్ అనిశ్చితిని సమతుల్యం చేయడం

పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి పరిస్థితులను అంబానీ అంగీకరించారు. అయితే సాంకేతికత, రెన్యూవబుల్ ఎనర్జీలో పురోగతి కారణంగా ఈ కాలాన్ని అందుబాటు ధరల స్వర్ణ యుగంగా అభివర్ణించారు. క్లీన్ ఎనర్జీ, జీనోమిక్స్, AI, డీప్ టెక్ రిలయన్స్ భవిష్యత్తు కోసం అభివృద్ధి నమూనాను రూపొందిస్తాయని పేర్కొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget