అన్వేషించండి

Loans: రైతులు, వ్యాపారులకు క్షణాల్లో రుణం - ఏర్పాట్లు చేస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌

'పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఫర్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌' (PTPFC) ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆర్‌బీఐ చెబుతోంది.

UPI Like Credit Platform For Farmers And MSMEs: సకాలంలో సరిపడా అప్పు పుట్టక రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతుంటారు. చేతిలో డబ్బు లేక, సమయానికి తగ్గ పెట్టుబడి పెట్టలేక మానసికంగా కుంగిపోతుంటారు. ఈ ఇబ్బందులు సమసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ పరిష్కారాల కోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త పథకాన్ని సిద్ధం చేస్తోంది. రైతులు, MSME (Micro, Small, and Medium Enterprises)లకు లోన్లు ఇవ్వడానికి UPI తరహా వేదికను తీసుకురావాలని RBI ఆలోచిస్తోంది.

డిజిటల్ చెల్లింపుల విషయంలో UPI పని చేసే విధంగానే ఈ ప్రతిపాదిత క్రెడిట్ డిస్‌బర్సల్‌ ప్లాట్‌ఫామ్ (Credit Disbursal Platform) పని చేస్తుంది. రైతులు & MSMEలకు లోన్‌ ప్రాసెస్‌ను సరళంగా మారుస్తుంది. 

సాంకేతికత ఎంత పెరిగినా, లోన్‌ తీసుకోవడానికి రైతులు & చిన్న వ్యాపారులు ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని, డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదార్ల రుణాలు ఇవ్వడం ఇప్పుడు చాలా సులభమని ఆర్‌బీఐ విశ్వసిస్తోంది. 

క్షణాల్లో రుణం పొందే అవకాశం                     
RBI చెబుతున్న ప్రకారం, ప్రతిపాదిత క్రెడిట్ ప్లాట్‌ఫామ్ రైతులు & MSMEలకు రుణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ప్రస్తుతం, రైతులు వ్యవసాయ రుణం లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card - KCC) పొందడానికి బ్యాంకులతో పాటు భూ రికార్డుల విభాగాల చుట్టూ రౌండ్స్‌ కొట్టాల్సి వస్తోంది. ఆర్‌బీఐ ప్రతిపాదిత ఫ్లాట్‌ఫామ్‌ అమల్లోకి వస్తే ఈ సమస్యలన్నీ తరతాయి & క్షణాల్లో రుణం పొందడం అనుభవంలోకి వస్తుంది.

'పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఫర్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌' (PTPFC) ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. ఈ వేదిక, ప్రస్తుతం, వ్యవసాయ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్, స్మాల్ MSME లోన్స్‌ వంటి రుణ ఉత్పత్తులపై పని చేస్తోంది. రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు & స్టార్టప్‌లను దీనితో అనుసంధానించవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ. 3,500 కోట్ల విలువైన వ్యవసాయ  & MSME రుణాలను పంపిణీ చేశారు.

PPI ద్వారా ప్రజా రవాణా చెల్లింపులు              
PPI (Prepaid Payment Instruments), అంటే ప్రి-పెయిడ్ చెల్లింపు సాధనాలకు సంబంధించి కూడా రిజర్వ్ బ్యాంక్‌ ఒక మార్పు చేసింది. ఇప్పుడు, ప్రజా రవాణా వ్యవస్థ కోసం చేసే చెల్లింపులను బ్యాంకులు & నాన్ బ్యాంకింగ్ సంస్థలు (NBFCs) జారీ చేసే PPIల ద్వారా చేయవచ్చు. ప్రజా రవాణాను ఉపయోగించే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రజా రవాణా వ్యవస్థల్లో చెల్లింపుల కోసం PPI ప్రవేశపెట్టడానికి బ్యాంకులు & నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనుమతించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.

మరో ఆసక్తికర కథనం: అనంత్‌ అంబానీ లైఫ్‌ స్టైల్‌కు సంబంధించిన ఆశ్చర్య పరిచే విషయాలు 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget