అన్వేషించండి

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Excise Duty On Petrol Diesel: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రజలకు శుభవార్త చెప్పారు. పెరుగుతున్న పెట్రో భారాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించింది. పెరుగుతున్న ధరాభారం నుంచి రక్షించేందుకు ముందుకొచ్చింది. ద్రవ్యోల్బణం ప్రభావం పేదలపై పడకుండా చర్యలు తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడమే కాకుండా గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 వరకు సబ్సిడీ ప్రకటించింది. శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు.
 
అడ్డు, అదుపు లేకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్యుడు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్లోనే కేంద్ర ఎక్సైజ్‌ సుంకం కొంత తగ్గించినప్పటికీ ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో మళ్లీ ధరలు పెరగాయి. దీంతో మరోసారి ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లీటర్‌ పెట్రోలుపై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించారు. దీంతో లీటర్‌ పెట్రోలు రూ.9.5, లీటర్‌ డీజిల్‌ రూ.7 మేరకు తగ్గనుందని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వలా యోజన కిందున్న 9 కోట్ల మందికి గ్యాస్‌బండ భారం తగ్గించారు. 12 సిలిండర్ల వరకు ఒక్కో సిలిండర్‌పై  రూ.200 సిబ్సిడీ ప్రకటించారు.

'నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పేదలు, ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నాం. దాంతో ఇంతకు ముందున్న ప్రభుత్వాలతో పోలిస్తే మా హయాంలో సగటు ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది. ప్రస్తుతం ప్రపంచం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచం ఇప్పటికీ కొవిడ్‌ నష్టాల నుంచి రికవరీ అవుతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో సరఫరా గొలుసు సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో చాలా ఉత్పత్తులు, వస్తువుల కొరత ఏర్పడింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి' అని నిర్మల తెలిపారు.

కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుందని నిర్మల పేర్కొన్నారు. పీఎం గరీబ్‌ కల్యాణ్ అన్న యోజనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయని తెలిపారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా నిత్యావసర సరకుల కొరత రాకుండా కృషి చేశామన్నారు. నిత్యావసర సరకుల ధరలు తక్కువగా ఉండేలా నియంత్రించామని వెల్లడించారు.

అంతర్జాతీయంగా ఎరువల ధరలు పెరుగుతున్నా వాటి భారం నుంచి మన రైతులను రక్షించామని నిర్మల తెలిపారు. బడ్జెట్‌లో ఇప్పటికే ప్రకటించిన రూ.1.05 లక్షల కోట్ల సబ్సిడీకి అదనంగా మరో రూ.1.10 లక్షల కోట్ల సబ్సిడీని ప్రకటించారు. సామాన్యుడికి ఉపశమనం కలిగేలా పనిచేయాలని పభుత్వంలోని అన్ని విభాగాలను ఆదేశించామన్నారు. పేదలు, మధ్యతరగతిని ఆదుకొనేందుకే నేడు నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని తెలిపారు.

నవంబర్లోనే పెట్రోలు, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించామని నిర్మలా సీతారామన్‌ గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రకటిస్తున్నామని చెప్పారు. నవంబర్లో కొన్ని రాష్ట్రాలు ధరను తగ్గించకుండా సామాన్యులపై భారం కొనసాగించాయని తెలిపారు. ఇప్పటికైనా వారు పన్ను తగ్గించాలని సూచించారు. ఏటా రూ.6100 కోట్ల భారం పడుతున్నా గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల దిగుమతిపై భారత్‌ ఎక్కువగా ఆధారపడింది. అందుకే ముడి సరుకులపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. దాంతో తయారైన వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని వెల్లడించారు. ఐరన్‌, స్టీల్‌ రా మెటీరియల్స్‌ పైనా సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఎగుమతి చేస్తున్న కొన్ని స్టీల్‌ ఉత్పత్తులపై ఎక్స్‌పోర్ట్‌ డ్యూటీ వేస్తామన్నారు.

తగినంత సిమెంటు అందుబాటులోకి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లాజిస్టిక్స్‌ను మెరుగుపరిచి సిమెంట్‌ ధర తగ్గేలా చూస్తామన్నారు. మీడియా సమావేశం ముగిసిన గంటలోనే తాము ప్రకటించిన అంశాల వివరాలతో నోటిఫికేషన్‌ వస్తుందని ఆమె వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget