అన్వేషించండి

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Excise Duty On Petrol Diesel: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రజలకు శుభవార్త చెప్పారు. పెరుగుతున్న పెట్రో భారాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించింది. పెరుగుతున్న ధరాభారం నుంచి రక్షించేందుకు ముందుకొచ్చింది. ద్రవ్యోల్బణం ప్రభావం పేదలపై పడకుండా చర్యలు తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడమే కాకుండా గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 వరకు సబ్సిడీ ప్రకటించింది. శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు.
 
అడ్డు, అదుపు లేకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్యుడు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్లోనే కేంద్ర ఎక్సైజ్‌ సుంకం కొంత తగ్గించినప్పటికీ ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంతో మళ్లీ ధరలు పెరగాయి. దీంతో మరోసారి ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లీటర్‌ పెట్రోలుపై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించారు. దీంతో లీటర్‌ పెట్రోలు రూ.9.5, లీటర్‌ డీజిల్‌ రూ.7 మేరకు తగ్గనుందని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వలా యోజన కిందున్న 9 కోట్ల మందికి గ్యాస్‌బండ భారం తగ్గించారు. 12 సిలిండర్ల వరకు ఒక్కో సిలిండర్‌పై  రూ.200 సిబ్సిడీ ప్రకటించారు.

'నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పేదలు, ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నాం. దాంతో ఇంతకు ముందున్న ప్రభుత్వాలతో పోలిస్తే మా హయాంలో సగటు ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది. ప్రస్తుతం ప్రపంచం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచం ఇప్పటికీ కొవిడ్‌ నష్టాల నుంచి రికవరీ అవుతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో సరఫరా గొలుసు సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో చాలా ఉత్పత్తులు, వస్తువుల కొరత ఏర్పడింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి' అని నిర్మల తెలిపారు.

కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుందని నిర్మల పేర్కొన్నారు. పీఎం గరీబ్‌ కల్యాణ్ అన్న యోజనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయని తెలిపారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా నిత్యావసర సరకుల కొరత రాకుండా కృషి చేశామన్నారు. నిత్యావసర సరకుల ధరలు తక్కువగా ఉండేలా నియంత్రించామని వెల్లడించారు.

అంతర్జాతీయంగా ఎరువల ధరలు పెరుగుతున్నా వాటి భారం నుంచి మన రైతులను రక్షించామని నిర్మల తెలిపారు. బడ్జెట్‌లో ఇప్పటికే ప్రకటించిన రూ.1.05 లక్షల కోట్ల సబ్సిడీకి అదనంగా మరో రూ.1.10 లక్షల కోట్ల సబ్సిడీని ప్రకటించారు. సామాన్యుడికి ఉపశమనం కలిగేలా పనిచేయాలని పభుత్వంలోని అన్ని విభాగాలను ఆదేశించామన్నారు. పేదలు, మధ్యతరగతిని ఆదుకొనేందుకే నేడు నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని తెలిపారు.

నవంబర్లోనే పెట్రోలు, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించామని నిర్మలా సీతారామన్‌ గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రకటిస్తున్నామని చెప్పారు. నవంబర్లో కొన్ని రాష్ట్రాలు ధరను తగ్గించకుండా సామాన్యులపై భారం కొనసాగించాయని తెలిపారు. ఇప్పటికైనా వారు పన్ను తగ్గించాలని సూచించారు. ఏటా రూ.6100 కోట్ల భారం పడుతున్నా గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల దిగుమతిపై భారత్‌ ఎక్కువగా ఆధారపడింది. అందుకే ముడి సరుకులపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. దాంతో తయారైన వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని వెల్లడించారు. ఐరన్‌, స్టీల్‌ రా మెటీరియల్స్‌ పైనా సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఎగుమతి చేస్తున్న కొన్ని స్టీల్‌ ఉత్పత్తులపై ఎక్స్‌పోర్ట్‌ డ్యూటీ వేస్తామన్నారు.

తగినంత సిమెంటు అందుబాటులోకి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లాజిస్టిక్స్‌ను మెరుగుపరిచి సిమెంట్‌ ధర తగ్గేలా చూస్తామన్నారు. మీడియా సమావేశం ముగిసిన గంటలోనే తాము ప్రకటించిన అంశాల వివరాలతో నోటిఫికేషన్‌ వస్తుందని ఆమె వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver Price Today: ఈరోజు బంగారం, వెండి ధర పెరిగిందా లేదా తగ్గిందా? ఈరోజు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలి? 
ఈరోజు బంగారం, వెండి ధర పెరిగిందా లేదా తగ్గిందా? ఈరోజు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలి? 
Retirement Planning Tips: చిట్కాలు పాటిస్తే పదవీ విరమణపై ఆందోళన ఉండదు! ఈ ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు! 
చిట్కాలు పాటిస్తే పదవీ విరమణపై ఆందోళన ఉండదు! ఈ ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు! 
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget