అన్వేషించండి

Coloured Currency Notes: హోలీ వేడుకల్లో మీ డబ్బులు రంగు మారాయా?, వాటిని ఈజీగా మార్చుకోండి

RBI Currency Note Exchange Rules: రూల్స్‌ ప్రకారం, కరెన్సీ నోట్లు తడిసిపోతే మీరు వాటిని ఆరబెట్టి మళ్ళీ వాడుకోవచ్చు. ఏ బ్యాంక్‌ లేదా దుకాణదారుడు వాటిని తీసుకోవడానికి నిరాకరించకూడదు.

Holi Coloured And Teared Currency Notes Exchange Rules: మార్చి 14న దేశమంతా హోలీ రంగులతో మునిగి తేలింది. కొన్ని ప్రాంతాల్లో మార్చి 15, శనివారం నాడు కూడా హోలీ ఆడతారు. ఈ రంగుల పండుగ వేడుకల్లో రంగులు వెదజల్లుకోవడం, నీటి బెలూన్లు విసురుకోవడం లేదా వాటర్ గన్‌లతో రంగు నీళ్లు చల్లడం వంటి చిలిపి చేష్టలతో సరదాగా గడుపుతారు. ముందు జాగ్రత్తలు లేకపోతే, సరదా సమయం ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితులను కలగజేస్తుంది. జేబులో డబ్బులు ఉన్నాయని మరిచిపోయి హోలీ ఆడితే, ఆ కరెన్సీ నోట్లు తడిచి చిరిగిపోవచ్చు & ఆ నోట్లకు రంగులు అంటుకుని వాటి రూపం మారిపోవచ్చు. ఒక్కోసారి, ఇంక్‌ వంటి రంగులు కూడా అంటుకుంటుంటాయి. సాధారణంగా, రంగులు అంటుకున్న & చిరిగిన నోట్లను తీసుకోవడానికి దుకాణదారులు అంగీకరించరు. దీంతో, ఆ నోట్లను ఎలా మార్చుకోవాలో అర్ధంగాక జనంలో టెన్షన్‌ పెరుగుతుంది.

రంగులు అంటిన నోట్లను మార్చుకోవచ్చా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, కరెన్సీ నోట్లను శుభ్రంగా ఉంచుకోవడం & చిరిగిపోకుండా చూసుకోవడం ప్రజల బాధ్యత. హోలీ వంటి సందర్భాల వల్ల నోట్లు రంగు మారినా లేదా తడిసి చిరిగిపోయినా, అలాంటి సందర్భాలకు సంబంధించి ఆర్‌బీఐ కొన్ని నియమాలు రూపొందించింది.

ఆర్‌బీఐ రూల్స్‌ ప్రకారం, మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు తడిసిపోతే మీరు వాటిని ఆరబెట్టి మళ్ళీ వాడుకోవచ్చు. ఏ బ్యాంక్‌ లేదా దుకాణదారుడు వాటిని తీసుకోవడానికి నిరాకరించకూడదు. నోటుకు రంగు అంటుకున్నప్పటికీ, ఆ నోటు భద్రత లక్షణంపై అది ప్రభావం చూపదని రిజర్వ్‌ బ్యాంక్‌ చెబుతోంది. కాబట్టి, మీరు ఏ బ్యాంకుకైనా వెళ్లి అలాంటి నోట్లను మార్చుకోవచ్చు. దీని కోసం బ్యాంకులు మీ నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయలేవు.

రిజర్వ్ బ్యాంక్‌ రూల్స్‌ ప్రకారం, కరెన్సీ నోట్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం లేదా ట్యాంపరింగ్ చేయడం నేరం. దీనికోసం, ఆర్‌బీఐ 'క్లీన్ నోట్' విధానాన్ని (RBI's clean note policy) అమలు చేస్తోంది. RBI చట్టం 1934లోని సెక్షన్ 27 ప్రకారం, ఎవరూ ఏ విధంగానూ కరెన్సీ నోట్ల రూపం మార్చకూడదు.

కొన్ని సందర్భాల్లో, ఇళ్లలో ఎక్కువ కాలం ఉంచిన కరెన్సీకి చెదలు పట్టడం లేదా ఎలుకలు కొట్టడం వంటివి కూడా జరుగుతుంది. బ్యాంక్‌ నుంచి తీసుకువచ్చిన నోట్ల కట్టలో లేదా ATM నుంచి డబ్బు తీసుకున్నప్పుడు కూడా చిరిగిన నోట్లు రావచ్చు. ఒక్కోసారి, జేబులోంచి డబ్బులు బయటకు తీయడం మరిచిపోయి వాటిని అలాగే ఉతుకుతారు. కొన్నిసార్లు నోట్లు పాక్షికంగా లేదా చాలా వరకు కాలిపోతాయి. అలాంటి నోట్లను దుకాణదారులు తీసుకోరు, వాటిని ఉపయోగించాలంటే ప్రజల తలప్రాణం తోకకు వస్తుంది. అయితే, వాటిని కూడా చాలా సులభంగా మార్చుకునే మార్గం ఒకటి ఉంది.

చిరిగిన & కాలిపోయిన నోట్ల మార్పిడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌లు, చెస్ట్ బ్రాంచ్‌లలో చిరిగిన కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చు. ఎవరి దగ్గరైనా కాలిపోయిన నోట్లు ఉంటే వాటిని కూడా మార్పిడి చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి కరెన్సీ నోట్ల మార్పిడికి కొన్ని షరతులు ఉన్నాయి. నోట్ల చిరిగినా లేదా కాలినా వాటిని గుర్తు పట్టేంత భాగం మిగిలి ఉండాలి & నోట్లపై నంబర్‌ ఉండాలి. 

కాలిపోయిన నోట్లను మార్చుకునే విషయంలో, ఆ నోట్ల పరిస్థితి దారుణంగా ఉండకూడదు. కొంత భాగం మాత్రమే కాలిపోతేనే దానిని మార్చుకోవచ్చు. దాదాపు పూర్తిగా లేదా గుర్తు పట్టలేనంతగా కాలిపోతే ఆ నోట్లను బ్యాంక్‌ల్లో కూడా తీసుకోరు. నోట్ల నంబర్ ప్యానెల్ సరిగ్గా ఉండాలి, ఆర్‌బీఐ గవర్నర్ సంతకం స్పష్టంగా కనిపించాలి. నోటు ఎక్కువగా కాలిపోతే వాటి విలువ కూడా తగ్గవచ్చు. 

ఎన్ని నోట్లను మార్చుకోవచ్చు?
ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, 10 రూపాయల కంటే ఎక్కువ విలువైన నోట్లను మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఒకేసారి 20 కంటే ఎక్కువ నోట్లను మార్చుకోకూడదు & ఆ అన్ని నోట్ల మొత్తం విలువ రూ. 5000 మించకూడదు.

ఒకవేళ, ఏ బ్యాంక్‌ అయినా చిరిగిన నోటు లేదా కాలిన నోటును మార్చడానికి నిరాకరిస్తే, మీరు ఆ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు చేయవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Gold Price Trends India: ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
SBI FD Rates Hiked: స్టేట్ బ్యాంక్ నుంచి బిగ్ గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంపు!
స్టేట్ బ్యాంక్ నుంచి బిగ్ గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంపు!
New Income Tax Act 2025: సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget