అన్వేషించండి

తొలగింపులపై Paytm ఉద్యోగులు ఆగ్రహం, కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు

Layoff in Paytm: లే ఆఫ్ అయిన పేటీఎం ఉద్యోగులు తమను చట్టవిరుద్ధంగా తొలగించారంటూ ఫిన్‌టెక్ మేజర్‌పై కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.

Paytm Layoffs: దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపు ఆటగాళ్లలో పేటీఎం గుర్తుంచుకోదగ్గ కంపెనీ. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, మెుబీక్విక్, ఫ్రీచార్జ్, క్రెడ్, ఫ్లిప్ కార్ట్ పే, నావీ పే వంటి అనేక పోటీదారుల మధ్య కంపెనీ వేగంగా లాభాల బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల కిందట కంపెనీపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన వైఖరితో కథ మెుత్తం రివర్స్ అయ్యింది. కంపెనీ తాజా పరిస్థితులతో తన మార్కెట్ షేర్ సైతం ఇటీవల కోల్పోవాల్సి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఫిన్‌టెక్ మేజర్‌ తన ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తోంది. అయితే కంపెనీ చట్టవిరుద్ధంగా తమను లేఆఫ్ చేస్తోందంటూ పేటీఎం ఉద్యోగులు ఏకంగా కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయటం పెద్ద సంచనంగా మారింది. తమను తొలగించినందుకు ఎటువంటి పరిహారం అందించకుండా ఏకపక్షంగా వ్యవహరించటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జూన్ 1-12 తేదీల మధ్య వచ్చిన ఫిర్యాదుల ప్రకారం పేటీఎం మేనేజ్‌మెంట్ అన్యాయంగా, అనైతికంగా తొలగించిందని ఆరోపిస్తూ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వాస్తవానికి ఫిన్‌టెక్ సంస్థకు చెందిన చాలా రైల్‌రోడ్‌లకు శక్తినిచ్చే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత.. తదనుగుణంగా కంపెనీ భారీ పునర్నిర్మాణాన్ని చేపట్టడం కంపెనీలోని ఉద్యోగాలను భారీగా ప్రభావితం చేసింది. దీనికి ముందు మే 22న కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ షేర్ హోల్డర్లకు రాసిన లేఖ ప్రకారం.. సంస్థ తన ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారిస్తుందని పేర్కొంది. ఈ సమయంలో భవిష్యత్తులో తొలగింపులు ఉండొచ్చని హెచ్చరించారు. తాజా వ్యవహారంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విభాగమైన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) బాధిత పేటీఎం ఉద్యోగులకు తన మద్దతు తెలిపింది. 

టెక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగుల ఖర్చులు గడచిన కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగాయని శర్మ చెప్పారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించటం ద్వారా ఏటా రూ.400-500 కోట్లను ఆదా చేయెుచ్చని శర్మ చెప్పారు. కంపెనీ పునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్టును అందిస్తున్నట్లు గతంలో వెల్లడించింది. 

పేటీఎం ఉద్యోగుల ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం.. యజమాని-ఉద్యోగి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, దానిని మూడవ పక్షం మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా పరిష్కరించాలని, సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆఫర్ లెటర్‌లో ఒక నిబంధన ఉంది. అందువల్ల విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లలేకపోతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget